వరంగల్ లోని బీజేపీ నిర్వహించిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ సభలో మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు తెలంగాణ ఉద్యమంలో మోడీ పాత్ర ఎంటి..?, మోడీయే విశ్వాస ఘతకుడు.. ద్రోహి అద్వానీ, వెంకయ్య నాయుడులను అతను తొక్కి వేశారు అంటూ ఆరోపించారు.
Bhatti Vikramarka: సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నక్కలగండిలో పీపుల్స్ పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాలకు సిద్ధమైన భూ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని మండిపడ్డారు.
సింగరేణి ప్రైవేటీకరణకు అడుగు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలంగాన కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వెలిగిపోతుందని, 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనే వస్తుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు.