Minister Srinivas Goud: ఎన్నికల కోసమే మోడీ బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ లోని బీజేపీ నిర్వహించిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ సభలో మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు తెలంగాణ ఉద్యమంలో మోడీ పాత్ర ఎంటి..?, మోడీయే విశ్వాస ఘతకుడు.. ద్రోహి అద్వానీ, వెంకయ్య నాయుడులను అతను తొక్కి వేశారు అంటూ ఆరోపించారు.
Read Also: Sharad Pawar: నాలో ఫైర్ ఇంకా అలాగే ఉంది.. అజిత్కు శరద్ పవార్ వార్నింగ్
Also Read
విభజన హామీలు అమలు చేయని మీరా నమ్మక ద్రోహులు ? మేమా ? అంటూ ప్రధానిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. కుటుంబ పాలన అంటారా?.. మరీ ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇచ్చారు.. ఏమైనా RSS కార్యకర్తకు ఇచ్చారా?.. అంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు దేవుళ్ళను వదలలేదు.. మాఠలను వదలలేదు.. మీరే అవినీతి పరులని మంత్రి అన్నారు.
Read Also: Bro First Single: మై డియర్ మార్కండేయ… రికార్డ్స్ ని రఫ్ఫాడిద్దాం పద
మోడీ ప్రధాన మంత్రిగా వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశాడు. ఎన్నికల కోసమే మోడీ బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు మోడీ మాటలను నమ్మరు.. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు.. మేము చెప్పని హామీలను కూడా ప్రకటించి.. అమలు చేశాం.. మిగిలిన హామీలను అమలు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Read Also: Harish Rao: మీరించ్చిదేమి లేదు.. మాకు వచ్చే డబ్బుల్నే ఆపారు
తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా.. ఓ చిన్న రిపేర్ కంపెనీ పెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని, ఏపీలో ఏడు మండలాలు కలిపి తెలంగాణకు తీవ్ర మోసం చేశారన్నారు. దేశానికి కరువొచ్చినా.. దేశానికి అన్నం పెట్టగలిగే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. పేర్లు మార్చి పెట్టుకున్న పథకాలు అన్నింటికీ తెలంగాణే కేంద్ర బిందువు అని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Richest Cricketer: ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా.. ఎన్ని కోట్లంటే..!
కర్ణాటక రాష్ట్రంలో అత్యంత అవినీతి చేసింది బీజేపీ ప్రభుత్వమేనని అక్కడి ప్రజలు ఆరోపించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రూ. 80 కోట్ల బీసీలు మోడీ ప్రధాని అయితే సంతోషపడ్డారు.. కానీ బీసీ మంత్రిత్వ శాఖ లేని ప్రభుత్వం మోడీదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అవినీతి జరిగి ఉంటే ఇన్ని అద్భుత పథకాలు ఎలా వస్తాయని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!