తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో చాలా తండాలకు రోడ్డుమార్గం లేదని, తండాలకు 100 శాతం బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వంలో చాలా గ్రామాలకు నీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి జరిగినట్లు అని ఆయన వ్యాఖ్యానించారు. చేసిన తప్పులకు శిక్షపడ్డా ఇంకా మారడం లేదని సీఎం…
ప్రమాద బీమా కవరేజీని రూ.కోటికి అందించేందుకు కృషి చేస్తున్నామని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు 30 లక్షలు. మంగళవారం కాంట్రాక్టు కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన బలరాం మాట్లాడుతూ.. ప్రమాద బీమా కవరేజీ పథకాన్ని ఇప్పటికే SBI , యూనియన్ బ్యాంకుల ద్వారా సింగరేణి ఉద్యోగులకు రూ.1 కోటి, కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనం కోసం త్వరలో ఇదే విధమైన పథకం అమలు చేయబడుతుందని…
మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామ సమీపంలో నిన్న రాత్రి మసీదును కూలగొట్టారని నెపంతో పెద్ద మొత్తంలో హైదరాబాదు నుంచి ముస్లింలు అక్కడికి చేరుకొని ప్రార్థనలు నిర్వహించి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ మళ్లీ మసీదును నిర్మించాలని చెప్పడంతో అధికారులు ఇది మత కల్లోలం జరుగుతుందనే నేపంతో దానిని పునర్ నిర్మించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ చిలుకూరు ప్రజలు మాత్రం ససేమిరా ఒప్పుకోవడం లేదు. అది మసీదు కాదు గుర్రాల శాల మాత్రమేనని…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. నేను అగ్ని పర్వతంలా ఉన్నానని, రాజకీయ కక్షతోనే నా…
గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించిందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ఆగస్టులో వైద్య పరీక్షలను ప్రారంభించి వారి హెల్త్ ప్రొఫైల్స్ ని రూపొందించేలా సంస్థ ప్లాన్ చేస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళా భవన్ లో మంగళవారం రాష్ట్రస్థాయి హెల్త్ వలంటీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ…
పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆధునీకరణపై రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి రివర్ మేనేజ్ బోర్డ్ చైర్మన్ అధ్యక్షతన 26న భేటీ కానున్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖానుండి ఉభయ రాష్ట్రాల ఈఎన్సీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. హైదరాబాద్ లోని జీఆర్ఎంబీ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. పెండింగ్ లో ఆధునీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు మీడియం…
రానురాను సైబర్ నేరగాళ్లకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. జనాలను మోసం చేసేందకు వినూత్న దారులు ఎంచుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. టెక్నాలజీపై అవగాహన లేని వాళ్ల అత్యాసకు పోయి డబ్బును పోగొట్టుకుంటున్నారు. మొన్నటికిమొన్న తెలంగాణలో స్కీముల్ని ఆసరాగా చేసుకొని ఎన్నో సైబర్ మోసాలు పుట్టుకొచ్చాయి. చివరికి మైక్రోసాఫ్ట్ సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యను కూడా ఆసరాగా చేసుకొని ఆన్ లైన్ మోసాలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ప్రవేశించింది. Sweet corn: వానాకాలంలో స్వీట్కార్న్తో…
కేంద్ర బడ్జెట్పై సీఎ రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు కక్షపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తూన్నారన్నారు. 18 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులను ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరచిన పార్లమెంటు ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు ఈ పది సంవత్సరాలలో గత ప్రభుత్వం తో జరిగిన నష్టం నుండి క్పడటానికి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుద…
ఇది దేశ హిత బడ్జెట్ అని, మోడీ విజనరీకి అద్దం పట్టేలా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బండి సంజయ్ స్పందిస్తూ.. నాగలికి రెండు ఎడ్ల మాదిరిగా అభివ్రుద్ది, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం గొప్ప బడ్జెట్ ను రూపొందించింది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకగా ఉంది. 2047 నాటికి ఆర్దిక ప్రగతిలో భారత్ ను నెంబర్ వన్ గా చూడాలనే…
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో మంచి వాతావరణం తెస్తామని, మూడోతరగతి వరకు అదే గ్రామంలో పాఠశాల ఉంటుందన్నారు భట్టి విక్రమార్క. అంగన్ వాడి అయాలతోపాటు విద్యాబోధన కోసం ప్రత్యేక టీచర్లు అని, ప్రతి పది గ్రామాలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండలానికి మూడు సమీకృత రెసిడెన్సిల్…