కర్నూలు జిల్లాలోని డోన్ రైల్వేస్టేషన్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ లో అల్లరి మూకల వ్యక్తులు అరాచకం సృష్టించారు. రాత్రి నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లేందుకు అల్లరి మూకలు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న భర్తపై దాడి చేసి మరో మహిళను లాక్కెళ్లేందుకు అల్లరి మూక ప్రయత్నం చేశారు. మహిళ కేకలు వేసి గొడవ చేయడంతో.. మహిళ కొడుకును ఎత్తుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య తోపులాట జరగడంతో మెట్టుకు మహిళ తల తగిలి మృతి చెందడంతో……
ఏపీలో వైసీపీ నేతలకు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. షర్మిల ఏపీలో పార్టీ పెడితే, అందులో చేరి జగన్ను బూతులు తిట్టే మొదటివ్యక్తి కొడాలినాని అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ప్రజలకు మేలు చేయటం చేతకాకే.. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేస్తే, అప్పుడు పోలీసు అధికారిగా ఉన్న వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా..?…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. గుడివాడలో అసలు క్యాసినో నిర్వహణ జరగలేదని ఆయన అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరం మాత్రమే జరిగాయని, కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో నా స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. శిబిరం నిర్వహించిన వారు నా స్నేహితులు, వారు ఎవరో కూడా కొడాలి నానికి తెలియదని, అది…
నవమాసాలు మోసి కన్న తల్లినే కొడుకు కడతేర్చిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో ఎక్సర్ సైజ్ చేస్తుండగా తల్లి మందలించింది. దీంతో సైకో కొడుకు సుధీర్ రాడ్ తో తల్లిని తలపై కొట్టాడు. అంతేకాకుండా అడ్డు వచ్చిన చెల్లెను సుధీర్ కూడా రాడ్ తో కొట్టాడు. అయితే ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న సుల్తాన్…
పీఆర్సీపై ఏపీలో పెను దుమారం లేస్తోంది. ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని అధికార వైసీపీ నేతలు అంటుంటే.. ఇలాంటి పీఆర్సీని చరిత్రలో చూడలేదంటూ ఉద్యోగులువాపోతున్నారు. 11వ పీఆర్సీని రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాలు హై కోర్టు ను ఆశ్రయించారు. ఈ క్రమంలో పీఆర్సీ జీవోలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. విపక్షాలు గుడివాడ ఘటనపై విమర్శలు గుప్పిస్తుంటే.. అధికార వైసీపీ నేతలు మాత్రం గుడివాడలో ఎలాంటి క్యాసినో జరగలేదని, విపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని అంటున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ క్యాసినో వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. క్యాసినో ఎక్కడ జరిగినా జరిగింది వాస్తవమా కాదా?…
నేటి యువత మద్యానికి బానిసై తమ నిండు జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. మద్యం మత్తులో కన్నుమిన్ను తెలియక అనర్దాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. అయితే పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న యువత మారడం లేదు. మద్యం మత్తులో సుబర్నా పాండే అనే యువతి వీరంగం సృష్టించిన ఘటన తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇండిగో ఎయిర్లైన్స్ ఉద్యోగి తో సుబర్నా పాండే దురుసుగా…
గత రెండు సంవత్సరాలు పట్టిపీడిసున్న కరోనా మహమ్మారి మరో సరి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. అయితే ఒమిక్రాన్ ప్రభావం ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఉండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోవిద్ నిభందనలు కఠిన తరం చేయడమే కాకుండా. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లు విధిస్తున్నాయి. అయితే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించిన ప్రభుత్వాలు 2001లో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రేరేపించాయి. స్వరాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణపై ఆంధ్రా నాయకుల రాజకీయ ఆధిపత్యం అంతరించి, కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కానీ, తెలంగాణకు జరిగిన అన్యాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ అన్ని రంగాలలో అపూర్వమైన పురోగతిని సాధించింది. కొత్త రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన సహాయాన్ని కేంద్రప్రభుత్వం అందజేసి ఉంటే ఇప్పటికి తెలంగాణ ఊహించని విధంగా పురోగతి సాధించేది. కేంద్ర ప్రభుత్వం…
నేటి సమాజంలో చిన్నాపెద్ద తేడాలేకుండా.. ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసిన.. ఎంత భయంకరంగా శిక్షించినా కామాంధులు మారడం లేదు. అన్యంపుణ్యం తెలియని చిన్నారులను సైతం కామాంధులు విడిచిపెట్టడం లేదు.. మృగాళ్లు చిన్నారులపై పడి విచక్షణ రహితంగా తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. సమాజంలో ఆడపిల్లల బతుకు ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే.. ప్రేమ పేరుతో ఓ వివాహితుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని వేధింపులకు గురి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.…