Home
Breaking News
Breaking News News
-
వినోద్ జైన్ కూతురు వయసు అని కూడా చూడకుండా వేధించాడు : చిన్నారి తాత
చిన్నారిని టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ఏపీలో దుమారం రేపుతోంది. ఈ సందర్బంగా ఆ చిన్నారి తాత మాణిక్యాలరావు మాట్లాడుతూ నా మనుమరాలిని నాలుగు నెలల వయసు నుంచీ పెంచాను. 2008 ఏప్రిల్ లో పుట్టింది. నిన్న మధ్యాహ్నం నుంచీ నా మనుమరాలు ముభావంగా ఉంది. నిన్న సాయంత్రం వాకింగ్ కి బయలుదేరినపుడు పలకరించింది. ఎప్పుడూ లేనిది కొత్తగా వాళ్ళ అమ్మను ఐ లవ్ యూ మమ్మీ అంటూ కౌగిలించుకుందని ఆయన… -
మూడు గంటల పాటు టోనిని విచారించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
విచారణలో భాగంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో డ్రగ్ డీలర్ టోనిని విచారించి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెనుదిరిగారు. మూడు గంటల పాటు టోని ని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారు. విచారణకు సహకరిస్తున్న టోనిని ప్రధానంగా మనీ ట్రాన్సక్షన్స్ పై ప్రశ్నలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అడిగారు. టోనికి బ్యాంక్ అకౌంట్ ద్వారా మనీ ట్రాన్సక్షన్స్ జరగలేదని స్పష్టతకు వచ్చిన పోలీసులు.. తన మిత్రుడు A2 ఇమ్రాన్ అకౌంట్ ద్వారా టోనీ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.… -
మత్తు పదార్థాలపై ఉక్కుపాదం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. గంజాయి సాగు చేస్తున్న రైతుల, పండిస్తున్న భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులచే ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో గంజాయి రవాణా చేస్తున్న వారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న సాగుచేస్తున్న… -
కేసీఆర్ హయాంలో ఆలయాలకు మహర్దశ : మంత్రి తలసాని
సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారిని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. కొమురవెళ్లి మల్లన్న మా ఇంటి కులదైవం ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. ఆలయం వద్ద భక్తులకు మెరుగైన వసతులు… -
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని అభివృధ్ది చేస్తాం : హరీష్ రావు
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్ రావు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అన్ని వార్డులను కలియ తిరిగారు. ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 50 పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు.కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయాన్నారు. ప్రస్తుతం 52 శాతం డెలివరీలు జరుగుతున్నాయని దీన్ని 75 శాతంకు పెంచాలన్నారు. జహీరాబాద్ లోనూ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలు… -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న పద్మశ్రీ డా.పద్మజారెడ్డి
గ్రీన్ఇండియా చాలెంజ్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పద్మజారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం.చెట్లు నాటడం అంటే దైవకార్యం తో సమానం అని ఆమె అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా బేగంపేటలోని తన నివాసంలో డా.పద్మజారెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా డా.పద్మజారెడ్డి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందని,… -
దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు: ఈటల
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా కేసీఆర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నర్సంపేట… -
ఆర్టీసీ ఆస్పత్రులన్నీ అప్డేట్ చేయాలి : బొప్పరాజు
పీఆర్సీపై ఏపీలో దుమారం రేగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 11వ పీఆర్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పీఆర్సీ పై ఉద్యోగసంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం వద్దు కానీ.. ఆర్టీసీ ఆదాయం మాత్రం కావాలా..? అని ఆయన ప్రశ్నించారు. పీటీడీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు.. ప్రమోషన్లు తక్షణం చేపట్టాలని అన్నారు. ఆర్టీసీ ఆస్పత్రులన్నీ అప్డేట్ చేయాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పేరు… -
‘ప్రభుత్వంపై నమ్మకం లేదు.. అందుకే మేం చర్చలకు వెళ్లడం లేదు’
ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగ సంఘాల నేతలు విముఖతతో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాలంటూ ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు చర్చకు రావడం లేదు మంత్రుల కమిటీ వెల్లడిస్తోంది. ఈ… -
అంబుడ్స్ మెన్ పై పోలీస్ స్టేషన్ లో అజారుద్దీన్ ఫిర్యాదు…
బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో అంబుడ్స్ మెన్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. హెచ్ సీఏ ప్రస్తుత కార్యవర్గాన్ని జింఖానా ఆఫీస్ లో అంబ్బుడ్స్ మెన్ వారు భయపెడుతున్నారు అంటూ ఫిర్యాదులో హెచ్ సీఏ అధ్యకుడు అజారుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కు గతంలో సస్పెండ్ చేసిన అంబడ్స్ మెన్ కు మధ్య…
తాజావార్తలు
-
Exclusive : అన్న కొడుకు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు అతిధిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు
-
Explainer: ఈసారి మహిళా బిల్లు పాస్ కావడం ఖాయం… మోడీ లెక్క ఇదే!
-
Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్లో జంట హత్యల కలకలం..
-
Bangladesh: 90 రోజుల్లో 100కు పైగా దాడులు.. బంగ్లాదేశ్లో మత చిచ్చుకు కారణమేంటి?
-
Chikungunya: గోమూత్రంతో చికున్గున్యాకు చెక్? ఐఐటీ రూర్కీ అధ్యయనం ఏం చెబుతోంది?
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!