World Cup 2027: వరల్డ్ కప్లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2027 వన్డే ప్రపంచ కప్కు సంబంధించిన భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ పేసర్, స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ను ప్రపంచకప్ జట్టులో తప్పకుండా ఎంపిక చేయాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. 2022 తర్వాత వన్డే క్రికెట్కు దూరంగా ఉన్న భువనేశ్వర్.. 2026 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. 28 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికాలో జరిగే 2027 వన్డే ప్రపంచ కప్లో భువనేశ్వర్ అనుభవం భారత జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. భువనేశ్వర్ను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అతడితో మాట్లాడి ఫస్ట్క్లాస్ క్రికెట్, విజయ్ హజారే ట్రోఫీ సహా అన్ని టోర్నీల్లో ఆడించాలి. ప్రపంచ కప్కు ముందు పూర్తి స్థాయిలో మ్యాచ్ ప్రాక్టీస్ కల్పిస్తే దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో అతడు జట్టుకు కీలక ఆయుధంగా మారతాడు’ అని పేర్కొన్నాడు. టీమిండియాకు ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మంచి బౌలర్ ఉన్నాడని, అతడికి భువీ కలిస్తే.. పేస్ బౌలింగ్ పటిష్టం అవుందని అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరు జట్టులో ఉంటే కప్పు కొట్టడం ఈజీనే అని, లేదంటే కష్టమే అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
- Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
- Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
- Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సిరీస్పై కూడా ఆర్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘శ్రీలంక పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తొలి టెస్టులో భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగాలి. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ముగ్గురికీ తుది జట్టులో చోటు కల్పించాలి. ఇటీవల ఇండియా-ఏ తరఫున శ్రీలంకలోని గాలే వేదికగా జరిగిన మ్యాచ్లో సాయి సుదర్శన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గాలే పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. అక్కడ ఇప్పటికే భారీ ఇన్నింగ్స్ ఆడిన అనుభవం అతడికి ఉంది. స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కోగల సుదర్శన్ ఫిట్గా ఉంటే భారత జట్టుకు అదనపు బలమవుతాడు’ అని చెప్పుకొచ్చాడు.
శ్రీలంక టెస్టు సిరీస్కు రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులో చేరడం భారత జట్టుకు ఊరటనిచ్చే అంశంగా మారింది. మరోవైపు మానవ్ సుతార్ తన గత ప్రదర్శనతో జట్టులో స్థానం నిలబెట్టుకోగా.. కుల్దీప్ యాదవ్ కూడా అందుబాటులో ఉండడంతో భారత జట్టు స్పిన్ విభాగం మరింత బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనలో భారత్ ఎలాంటి కాంబినేషన్తో బరిలోకి దిగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!