రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయటం సులభమవుతుందని, తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని అన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక్సాగర్…
దేశాన్ని ఏకం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. దేశ సంపద ఈ ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. లౌకికవాదం కలిగిన ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడి బిడ్డనేనని మతం పేరిట విభజన చేయడం తగదన్నారు. మత విభజన పేరిట వైశ్యామ్యాలను సృష్టించి…
బెల్లంపల్లి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన మూడు రోజులకే విదేశీ పర్యటనలు ఉన్న రేవంత్ రెడ్డిని అదానీ భేటీ అయి పెట్టుబడులు పెడతానంటూ సమావేశం ఏర్పాటు చేయడం, వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. సింగరేణి సంస్థపై అదానికి కన్ను పడిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రేవంత్…
ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నలభై రోజుల నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు…
కాంగ్రెస్ మైనార్టీలకు టికెట్ ఇచ్చింది .. కానీ ఓడిపోయామన్నారు షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి ఇవ్వలేదని, ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారన్నారు. టీఎస్పీఎస్సీలో.. మెంబర్ ఇచ్చామన్నారు షబ్బీఆర్ అలీ. హైకోర్టు జీపీ వస్తున్నారని, కాంగ్రెస్ ఏ పోస్టింగ్ ఇచ్చినా మైనార్టీ కోటా ఉంటుందన్నారు. కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఏం పదవులు ఇచ్చిందని, ఆకాశం మీద ఉమ్మితే మొఖం…
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో జెడ్పీటీసీ, మాజీ జడ్పీటిసి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సహా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంత మంత్రి నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్ట్ ల పేరిట నిర్బంధించారు, కాని మా ప్రభుత్వం స్వేచ్ఛ గా సమస్యలు…
ఒక చిన్న వివాదం చిలికిచిలి కి గాలి వానగా మారింది. విద్యార్థులు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. తమను బెదిరించారని ఒక జట్టు గట్టిన 13 మంది విద్యార్థులు తోటి విద్యార్థిని చితకబాదిన ఘటన ఇది. వీరంతా చదువుతున్నది కేవలం ఆరవ తరగతి మాత్రమే. ఆరవ తరగతిలోనే కక్షలు కార్పన్యాలతో ప్రతీకారం తీర్చుకునే స్థాయికి వెళ్లిన ఘటన ఇది. ఇది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోని tswrjc హాస్టల్లో ఈ ఘటన జరిగింది. ఆరవ తరగతి చదువుతున్న…
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా గంజాయి రవాణా కాకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని ఎక్పైజ్ శాఖ డిప్యూటీ కమీసనర్ జనార్ధన్ రెడ్డి చెబుతున్నారు. గత రాత్రి ఓడిస్సా , ఎపి రాష్ర్టాల మీదుగా గంజాయి చాక్లెట్స్ హైదరాబాద్ కు తరలుతున్న వాటిని ఎక్పైజ్ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. ఇలా ఖమ్మంలో గంజా చాక్లెట్స్ పట్టుకోవడం ఇదే ప్రదమం.. హైదరాబాద్ లో చాక్లెట్లను ఒక్క చోట అప్పగించవలసిన ఉన్నదని నిందితులు చెప్పారని అంటున్నారు. దీని మీద ఇంకా లోతుగా…
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని…
గత కొన్ని రోజుల నుండి అనగా ఈ నెల 25వ తేది నుండి గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాని తెలంగాణ శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పత్రికా ప్రకటనను సోమవారం విడుదల చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ రోజు నుండి ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా చికిత్సపొందుతున్నానని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉండటం కారణంగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 వ తేదీ సాయంత్రం గవర్నర్ గారి “AT HOME” కార్యక్రమానికి కూడా వెళ్ళలేదని…