హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్కు సంబంధించి ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ఉజ్వల భవిష్యత్ కోసం మీ కమిట్ మెంట్ ఎంతో స్పెషల్ అని, హైదరాబాద్ ఇంకా మరెంతో ప్రత్యేకం.. మరీ ప్రత్యేకంగా ఈ వేదిక ఇంకా ప్రత్యేకమన్నారు. పదేండ్ల క్రితం ఇక్కడే ఒక సభ పెట్టాను.. ఆ సభకు టికెట్ పెట్టామని, ఈ సభ ఒక టర్నింగ్ పాయింట్…
దుర్మార్గమైన కాంగ్రెస్, బీఆర్ఎస్లు చెరో వైపు సత్తా లేక పిరికిపందాల్ల బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు నవ్వుకుంటున్నారని, రేవంత్, రాహుల్, కెసిఆర్ ల సర్టిఫికెట్ బీజేపీ కి అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. మాకు తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలని, మోడీ లేని భారతాన్ని చూడలేమన్నారు. ఎవరు బాధపడ్డ తెలంగాణ అభివృద్ధి కి కమిట్ మెంట్ తో పనిచేస్తామన్నారు. గాడిద గుడ్డు ను నెత్తిన పెట్టుకొని…
రైతు సర్వతోముఖాభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆగస్టు 15 కల్లా, రైతు రుణమాఫీ అమలుచేసి తీరుతామని ఇప్పటికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు, మేము ప్రకటించిన విషయం విదితమే. తిరిగి రైతు ఈ అప్పుల ఊబిలో పడిపోకుండా మా ప్రభుత్వము రైతాంగ సంక్షేమం కోసం ఇతర పథకాల అమలుకు ప్రణాళిక చేస్తుందన్నారు. ముఖ్యంగా పంటనష్టపోయిన సందర్భాలలో రైతులను ఆదుకునే విధంగా పంటభీమా,…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాష్ట్ర పాలనను మరిచిపోయి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (కేసీఆర్)ను దుర్భాషలాడడంలో పోటీపడుతున్నారని సీనియర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆర్కె పురం డివిజన్ శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడుతూ మహేశ్వరం క్యాడర్ మద్దతుతో ఈ ప్రాంతం బీఆర్ఎస్కు కోటగా మారిందని అన్నారు. “కాంగ్రెస్ నాయకులు టాస్…
పార్లమెంట్ ఎన్నికలు దేశ.. మన కుటుంబాల భవిష్యత్తుకి కీలకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థని ధ్వంసం చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. కీలకమైన చట్టాలు.. ప్రతిపక్షాలను తొక్కేసి ఆమోదం పొందేవి అని ఆయన వ్యాఖ్యానించారు. నియంతృత్వ ధోరణి ప్రజలకు తెలియాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. మోడీ స్పీచ్లు చూస్తే.. ఇంత దిగజారి పోయారు అనిపిస్తుందని, స్టేట్స్ మెన్ లాగా ఉండాలి కానీ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ…
పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ఎన్నికలకు ముందు చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ కు చాలా మంచి స్పందన వచ్చిందని, 14,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే 6000 మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రంతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వస్తుందని, హోమ్ ఓటింగ్ కూడా చాలా…
రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని మోసం చేశారని, ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా రేవంత్ రెడ్డి డేట్లు మారుస్తున్నాడని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో 10 ,12 సీట్లు మాకు ఇవ్వండని కోరారు. ఆరు నెలల్లో తెలంగాణ లో మళ్ళీ కేసీఆర్.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నమో అంటే నమ్మించి మోసం చేసే టోడు అని ఆయన అభివర్ణించారు. 2…
తెలంగాణలో జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఎన్నికల సభల్లో ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. మే 10న మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట, సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో మరో రెండు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు మరోసారి తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మహబూబ్నగర్ పార్లమెంట్ నారాయణపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.. సాయంత్రం ఐదు గంటలకు ఎల్బీ స్టేడియంలో…
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ కు ముందే హనుమాన్ దీక్షాపరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడుతుందా..! అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ మాలధారులు జై శ్రీరాం నినాదాలు చేస్తూ కేటీఆర్ రాకకు నిరసన తెలిపారు. కొద్దిసేపు పోలీసులకు, స్వాములకు…
నర్సాపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం రాకముందు అత్తాడుగువర్గాల వారికీ ఎటువంటి హక్కులు లేవని, రాజ్యాంగం వచ్చాకే మనకు హక్కులు వచ్చాయన్నారు. ఈ రాజ్యాంగం మన కోసం మనం రాసుకోవడానికి అనేకమంది తమ రక్తాన్ని ధారాబోశారని, బీజేపీ అగ్ర నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా చెబుతున్నారన్నారు రాహుల్ గాంధీ. మోడీ, ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని మార్చాలని అంటుందని, రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మాదని…