మావోయిస్టుల కుట్రను భగ్నం చేశారు ములుగు జిల్లా పోలీసులు. మందు పాతరను ములుగు జిల్లా పోలీస్ నిర్వీర్యం చేశారు. సాధారణ ప్రజలు తిరిగే కాలి బాటలో పెట్టిన మందుపాతరను కనిపెట్టి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను గుర్తించడమే లక్ష్యంగా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వెంకటాపురం…
బలగం మొగులయ్య తీవ్ర అస్వస్థకు గురైన సమాచారం తెలుసుకొని తక్షణం స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ బలగం మొగిలయ్యకు మెరుగైన వైద్య చికిత్సను అందించాలని అధికారులకు అదేశించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు మొగులయ్యకు వరంగల్ లోని సంరక్ష ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స ను అందిస్తున్నారు జిల్లా వైద్య శాఖ అధికారులు. బలగం సినిమా లో నటించి ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్న నటుడు, బుడగ జంగాల కళాకారుడు బలగం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురైన సమాచారం…
తెలంగాణలోని 17 స్థానాలకు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో ఓటర్లు నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) ఆప్షన్ను ఎంచుకున్నారు. మొత్తం 1,02,654 మంది ఓటర్లు, 0.47% మంది ఓటర్లు నోటాను ఎంచుకోవడం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో నోటాను ఎంచుకున్న 1.03% కంటే ఇది తగ్గుదలని సూచిస్తుంది. వివిధ నియోజకవర్గాల్లో నోటా ఓట్లు ఇలా : మల్కాజిగిరి: 13,366 ఓట్లు ఆదిలాబాద్: 11,762 ఓట్లు వరంగల్: 8,380 ఓట్లు…
పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సమాజానికి తెలుసు అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సొంత జిల్లాల్లో ఎమ్మెల్సీ, ఎంపీ గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి పొంకణాలు కొడుతున్నారని, నేను ఎవరి దయాదాక్షణ్యాల మీద గెలవలేదన్నారు. మల్కాజ్ గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు రఘునందన్ రావు. సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరి ఓడిపోతే మాట్లాడని రేవంత్ రెడ్డి…
రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ కార్యకర్త ఈర్యానాయక్పై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి హత్య చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఆయన మృతికి కారకులైన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, బీఆర్ఎస్ కార్మికుడి హత్య వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని రఘునాథపాలెం మండలం శివాయిగూడెం గ్రామంలో మృతి చెందిన కార్మికుని కుటుంబ సభ్యులను పరామర్శించి పరామర్శించారు. మృతి చెందిన కార్మికుడి అంత్యక్రియల ఖర్చుల కోసం అజయ్కుమార్ ఆర్థిక…
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో గత నెలలో పోలీసు అధికారి కారును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడిన వారిలో ఐదుగురు నక్సలైట్లు తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఫర్సెగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండెం-కుప్రేల్ గ్రామాల నుంచి ఐదుగురు నక్సలైట్లను అరెస్టు చేయగా, మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్టయిన వారంతా హత్య, భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాధ్యత వహించిన మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకుని విజయం సాధించిన బీజేపీ ఎంపీ డీకే అరుణతో ఎన్టీవీ ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నా గెలుపును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 సార్లు వచ్చి సభలో పెట్టిండని, వ్యక్తి గతంగా నన్ను రేవంత్ రెడ్డి దూషించాడని ఆమె మండిపడ్డారు.…
పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన పెంచుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని మహాత్మా జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జీవించడానికి మన పర్యావరణం చాలా ముఖ్యమైనదని అన్నారు. వాతావరణ అనుకూలంగా ఉండే విధంగా…
2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్రాన్ని ఏలిన కె.చంద్రశేఖర్ రావు ఇంటి బాట పడుతున్నారు. అయితే.. భారత రాష్ట్ర సమితి (BRS) లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. కనీసం ఆధిక్యం దరిదాపుల్లోకి కూడా బీఆర్ఎస్కు చెందిన నేతలు రాకపోవడం గమనార్హం. తెలంగాణలో ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఒక్కొక్కటి ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మిగిలిన సీటు,…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా విచారణ స్వీకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేపు సీజే ధర్మాసనం విచారణ జరపనుంది. హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లడయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సుమోటా పిటిషన్ గా హైకోర్టు స్వీకరించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఎస్ఐబి మాజీ హూ ఇస్ ది ప్రభాకర్ రావు,…