ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ తొత్తులు ఇచ్చినవే అని ఎన్టీవీతో మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని, ఎగ్జిట్ పోల్స్ పేరిట బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు. బీజేపీ సూచనల మేరకే ఎగ్జిట్ పోల్స్ అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు అద్బుతమైన మెజారిటీ తో గెలుస్తోందని, బీజేపీ మూడు సీట్లలో మాత్రమే బలం ఉందన్నారు మంత్రి పొంగులేటి. ఐదు సీట్లలో కాంగ్రెస్ కు…
తెలంగాణ రాష్ట్రం సాధించి దశాబ్ది ఉత్సవాలు కాదు కాంగ్రెస్ ఉత్సవాలు ను తలపించిందన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా పల్లా రవీందర్ రెడ్డి హల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు లో రేవంత్ పాత్ర చెప్పలేదని, ఉద్యమంలో పాల్గొనని వాళ్లు ఉత్సవo చేస్తే ఎలా ఉంటుందో అది కొరవడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సిఎం రేవంత్ ఏమాత్రం సంబంధం లేదని, రాష్ట్ర…
నేను ఓడిపోతానా..? ఎగ్జిట్ పోల్స్ పై రోజా ఫస్ట్ రియాక్షన్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్పై స్పందించారు మంత్రి రోజా. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్పై ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు వండుతున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని చెప్పినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కావడం తథ్యమని రోజా స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజలు…
ఇదిలా ఉంటే.. హనుమకొండలోని డీ కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, సిరిసిల్ల రాజయ్య, సీతారాం నాయక్,…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తాజా చార్జ్ షీట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ కేసులో కవిత పై అభియోగాలు నమోదు చేసింది ఈడీ. మే 10న కవిత పై చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ.. 8364 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత పాత్ర ఉందని, బుచ్చిబాబు కవిత పాత్ర పై వాంగ్మూలమిచ్చారు ఆ తర్వాత కవితకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకోవాలని…
నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న…
కౌంటింగ్పై పార్టీ శ్రేణులకు అవగాహన కలిగించటం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయం నుండి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్లో అనుసరించాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తల పై దిశా నిర్దేశం చేశారు సజ్జల.. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ఏజెంట్లకు బాధ్యత ఉంది…. అధికారం ఉందని, కౌంటింగ్ సెంటర్ లో అలర్టు గా ఉండాలన్నారు. బ్యాలెన్స్ గా ఉండాలి…సంయమనం కోల్పోవద్దన్నారు సజ్జల.…
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా.. ‘మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా.. సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు.. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు.. పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్క…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ను నల్లగొండ జిల్లాలోని గాంధీ గుడి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ ను గాంధీ గుడి సభ్యులు శాలువాతో సత్కరించారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు తీసుకున్న చర్యలను గవర్నర్కు గాంధీ గుడి సభ్యులు వివరించారు. అంతేకాకుండా.. మద్యపాన నిషేధ ప్రచారాన్ని చేయాలని గాంధీ గుడి సభ్యులకు గవర్నర్ సూచించారు. డబ్బు పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే తాను ఓ ఎన్నికల్లో ఓడిపోయానని…
తన తల్లిని కాపాడేందుకు ముందుకు వచ్చిన ఖడ్గమృగం పిల్ల హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తల్లి ఖడ్గమృగానికి వైద్యం చేసేందుకు వచ్చిన వైద్యుడిపై దాడికి సిద్ధమైన ఈ చిన్నారి.. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. తన తల్లి ప్రమాదంలో ఉందని గ్రహించి, బిడ్డ ఖడ్గమృగం తన తల్లిని రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నించడాన్ని చూడవచ్చు. చిన్న ఖడ్గమృగం తన కొమ్ముతో డాక్టర్పై ఎలా దాడి చేస్తుందో వీడియో క్యాప్చర్ చేస్తుంది. నిజానికి,…