Gun Violence: కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులతో సహా 11 మంది మృతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Violence: దక్షిణాఫ్రికాలోని రాజధాని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన భయంకర కాల్పులు స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. ఈ దారుణ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. దక్షిణాఫ్రికన్ పోలీస్ సర్వీస్ (SAPS) తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 4:15 గంటల తర్వాత ఈ హత్యాకాండ చోటుచేసుకుంది. అయితే పోలీసులకు సమాచారం ఉదయం 6 గంటల సమయంలో అందింది. గాయపడిన వారిని అత్యవసరంగా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.
Tragedy: విషాదం..ఖర్జూరం విత్తనం గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
Also Read
పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది ముగ్గురు ఆయుధదారుల గ్యాంగ్ జరిపిన దాడి అని తేలింది. సమాచారం ప్రకారం.. వారు అకస్మాత్తుగా అక్కడ కూర్చున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రజలు ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే అనేక మంది అక్కడికక్కడే కుప్పకూలారు. ప్రస్తుతం ఈ దుండగుల కోసం పెద్ద ఎత్తున సెర్చ్ ఆప్షన్ కొనసాగుతోంది. పోలీసులు ఈ ఘటనకు గల ప్రధాన కారణంగా అక్కడి అక్రమ మద్యం దుకాణాలను చూపుతున్నారు. లైసెన్స్ లేని బార్లు, పబ్లు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడే గొడవలు, హింసాత్మక ఘటనలు తరచూ జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
తక్కువ ధరలో ప్రీమియం అనుభవం.. Hisense E6N 65 అంగుళాల 4K స్మార్ట్ LED టీవీపై భారీ ఆఫర్లు..!
తాజావార్తలు
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..