CM Revanth: తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్.. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం..!
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' ప్రారంభం.
- రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం కీలకమన్న గవర్నర్
- సమ్మిట్లో పెట్టుబడులు, ఉపాధి, ఇన్నోవేషన్ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు
- ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ను నిపుణుల సహకారంతో సిద్ధం చేశాం: సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం దోహదపడుతోందని గవర్నర్ పేర్కొన్నారు. సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. పెట్టుబడులు, ఉపాధి, ఇన్నోవేషన్ ప్రధాన లక్ష్యంగా 27 అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు.
Krithi Shetty: హోటల్ రూమ్లో ఆత్మను చూశా..షాకింగ్ విషయం బయట పెట్టిన కృతిశెట్టి
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో తెలంగాణ భవిష్యత్ విజన్ను స్పష్టంగా వివరించారు. దేశ భవిష్యత్ కోసం రాజ్యాంగ సభ ఏర్పాటు చేసి భారత రాజ్యాంగ నిర్మాతల దృష్టిని గౌరవించడం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలే తెలంగాణ అభివృద్ధి మార్గదర్శకాలని ఆయన అన్నారు. విడిపోయిన తర్వాత ప్రజా పోరాటంతో సాధించిన ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ 2014లో సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో భారత పటంలో చోటు చేసుకుందని గుర్తు చేశారు. గత దశాబ్దంలో రాష్ట్రం అత్యధిక అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగిందన్నారు.
రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికల కోసం నిపుణుల కమిటీ ఏర్పాటుతో ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ను సిద్ధం చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ డాక్యుమెంట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా రూపొందించబడిందని, ISB, నితి ఆయోగ్, నిపుణుల సూచనలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడం ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ జనాభాలో 2.9 శాతమే ఉన్నా.. దేశ GDPలో 5 శాతం వాటా సాధించిన తెలంగాణ 2047 నాటికి దాన్ని 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
Minister Anita: విద్యార్థినికి న్యాయం చేస్తాం.. మహిళల రక్షణే మా లక్ష్యం..!
రాష్ట్ర అభివృద్ధి కోసం మొదటిసారి క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్ల అభివృద్ధి మోడల్ను అమలు చేస్తున్నామన్నారు. చైనా గ్వాంగ్డాంగ్ మోడల్ను ఆదర్శంగా తీసుకొని.. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాల పోటీ స్థాయికి తెలంగాణను తీసుకెళ్లే ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు కీలక భాగస్వాములని.. వారికి ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నట్లు సీఎం అన్నారు. “కష్టం అయితే వెంటనే చేయండి.. అసాధ్యమైతే డెడ్లైన్ పెంచుతాం” అని సందేశం ఇచ్చారు. “తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్” అంటూ రాష్ట్ర ఎదుగుదలను ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..