దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే ఆర్మీ జవాన్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు.. అమరాపురం మండలం ఉదుకూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
జమ్మూ కశ్మీర్లోని పాకిస్థాన్ సరిహద్దులో జరిగిన క్రాస్ కాల్పుల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్)కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఇంతియాజ్ అమరులయ్యారు. బీఎస్ఎఫ్ ట్వీట్ ద్వారా ఆయన బలిదానాన్ని ధృవీకరించింది. మహ్మద్ ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి వందనం సమర్పించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. మే 8 మరియు 9 తేదీల మధ్య రాత్రి జరిగిన షెల్లింగ్లో మహ్మద్ ఇంతియాజ్ గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..
Gold Smuggling: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లాలోని గల భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో మంగళవారం నాడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది భారీ బంగారం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఢాక నుంచి భారతదేశానికి తీసుకు వస్తున్న రూ.1.48 కోట్ల విలువైన బంగారు కడ్డీలను 32వ బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ అధికారులు అరెస్టు చేశారు.
Terrorist Attack: 2025 జనవరి 25న, జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఉగ్రవాద ఘటన చోటుచేసుకుంది. బిల్వార్ ప్రాంతంలోని భటోడి, మువార్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంపుపై అర్థరాత్రి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, సైన్యం ఎదుకాల్పులు చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సంఘటనతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అదనపు డైరెక్టర్ జనరల్…
India-Bangladesh Border: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. ముఖ్యం పాకిస్తాన్తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. మరోవైపు ఆ దేశంలోని మైనారిటీలు, ప్రధానం హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇక బంగ్లా మాజీ ఆర్మీ అధికారులు భారత్కి వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. Read Also: Rahul Gandhi:…
భారత్లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెప్పాయి.
పాకిస్థాన్ నుంచి భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లు అధికమయ్యాయి. చొరబాట్లను మెరుగ్గా నిరోధించడానికి సరిహద్దు భద్రతా దళం (BSF) చర్యలు ప్రారంభించింది. ఇటీవల పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి జమ్మూ ప్రాంతంలో 2,000 మంది సిబ్బందితో కూడిన రెండు కొత్త బెటాలియన్లను మోహరించింది. ఈ బెటాలియన్ల సైనికులు పాకిస్థాన్తో అంతర్జాతీయ సరిహద్దులో బీఎస్ఎఫ్ విస్తరణ పాయింట్ వెనుక 'సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్'గా మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు బెటాలియన్లు ఇటీవల ఒడిశాలోని యాంటీ నక్సల్ ఆపరేషన్…
భార్య మరణవార్త తెలియడంతో సరిహద్దు భద్రతా దళం(BSF) జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ఓ బీఎస్ఎఫ్ జవాను ఫోన్లో తన భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో ఉన్న తన భార్య మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
పంజాబ్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం ఇవాళ (శుక్రవారం) జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ చొరబాటుదారుడిని హతమార్చారు. పాక్ సరిహద్దుల్లో చొరబాటుదారుడి కదలికలు పనిగట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు.. వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
Honey Trap: భారతదేశ రహస్యాలను తెలుసుకోవడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హనీట్రాప్ ని ఉపయోగిస్తున్నాయి. ఇప్పటికే డీఆర్డీఓలో పనిచేస్తున్న ఓ సైంటిస్టు సున్నితమైన భారత మిస్సైల్ రహస్యాలను ఓ పాకిస్తాన్ మహిళా ఏజెంట్ లో పంచుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది.