బాలీవుడ్ అంటే ఇండియాలో ‘హిందీ సినిమా రంగం’ మాత్రమే! కానీ, బయట ప్రపంచానికి బాలీవుడ్డే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ! మంచికో, చెడుకోగానీ భారతదేశంలోని ఇతర భాషా సినిమా రంగాలు పెద్దగా అంతర్జాతీయ గుర్తింపు పొందలేకపోయాయి. ఇక ఇదే పరిస్థితి మన సినిమా సెలబ్రిటీలది కూడా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, మరాఠీ లాంటి సినిమా రంగాల్లో చాలా మంది నటీనటులున్నా… బాలీవుడ్ బిగ్ షాట్స్ కి దక్కే పబ్లిసిటీ ఇతరులకి దక్కదు. ఇందుకు మంచి ఎగ్జాంపుల్స్…
బాలీవుడ్ లో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్స్ అంటే దీపికా, ఆలియా లాంటి వారి పేర్లు చెబుతారు. కానీ, నెక్ట్స్ జనరేషన్ టాప్ బ్యూటీస్ అంటే జాన్వీ, అనన్య పాండే లాంటి వారి పేర్లు వినిపిస్తాయి. సైఫ్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ కూడా గట్టి పోటీ ఇస్తోంది బీ-టౌన్ యంగ్ బ్యూటీస్ కి.అక్షయ్ కుమార్, ధనుష్ మల్టీ స్టారర్ గా రూపొందిన ‘అత్రంగీ రే’ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్. అయితే, ‘అత్రంగీ రే’…
ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ టాప్ బ్యూటీతోనూ తెరపై రొమాన్స్ చేశాడు. కానీ, ఎందుకో తిరిగి విదేశాలకు వెళ్లిపోయాడు. మళ్లీ బాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తాడన్న ఆశ కూడా లేదు. అయితే, ఆయన చిన్నపాటి బిగ్ స్క్రీన్ కెరీర్ లో ‘ఢిల్లీ బెల్లి’ పెద్ద సంచలనం!అభినయ్ డియో డైరెక్షన్ లో రూపొందింది ఇమ్రాన్ ఖాన్ స్టారర్ ‘ఢిల్లీ బెల్లి’. దేశ రాజధానిలో జరిగే ఈ సినిమా…
నోటి దాకా వచ్చిన ముద్ద నోట్లోకి వెళ్లకపోవటం అంటే ఏంటో… పాపం నోరాకి తాజాగా తెలిసి వచ్చిందంటున్నారు… బాలీవుడ్ జనాలు! ఆమె నోటిదాకా వచ్చిన ఓ ముద్దొచ్చే క్యారెక్టర్ చివరి నిమిషంలో చేజారిపోయిందట! ఇంతకీ, విషయం ఏంటంటే…టైగర్ ష్రాఫ్ టైటిల్ రోల్ లో దర్శకుడు వికాస్ బాల్ ‘గణ్ పత్’ అనే సినిమా రూపొందించబోతున్నాడు. రెండు భాగాలుగా ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ వన్ అండ్ టూ రెండిట్లోనూ కృతీ సనోన్ హీరోయిన్ గా…
కరోనా కారణంగా ఎన్నో సినిమాలు ఆలస్యమయ్యాయి. లాక్ డౌన్స్ పదే పదే షూటింగ్స్ ని ఆపేశాయి. అయితే, ‘శర్మాజీ నమ్కీన్’ ఈ మధ్య కాలంలో డిలే అయిన మూవీస్ లో చాలా స్పెషల్. హితేశ్ భాటియా దర్శకత్వంలో రూపొందుతోన్న ఎంటర్టైనర్ రిషీ కపూర్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, పోయిన సంవత్సరం కరోనా ఫస్ట్ లాక్ డౌన్ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తరువాత లాక్ డౌన్ కాలంలోనే రిషీ కపూర్ క్యాన్సర్ తో…
బాలీవుడ్ లో ఎప్పుడూ భగ్గుమనే క్రేజీ ఫైట్… తాప్సీ, కంగనాదే! కొన్నాళ్లుగా సాగుతోన్న వీరిద్దరి మాటల యుద్ధం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాప్సీ కంగనా గురించి మాట్లాడటంతో ఈసారి రచ్చ మొదలైంది. కానీ, తాప్సీ పెద్దగా తప్పుగా ఏం మాట్లాడలేదు ఫైర్ బ్రాండ్ కంగనా గురించి. అయినా, బీ-టౌన్ ‘తలైవి’ తాప్సీకి మరోసారి గట్టిగా తలంటేసింది!ఓ ఇంటర్వ్యూలో… ‘కంగనా మంచి నటి. గతంలోనూ, ఇప్పుడు కూడా, ఇక మీదట కూడా’ అంది తాప్సీ. అంతే కాదు, ఆమెను…
బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు రాజ్ కుమార్ హిరానీతో పని చేయాలని కోరుకుంటారు. అటువంటి టాలెంటెడ్, సెన్సిటివ్ డైరెక్టర్ ఆయన. అయితే, ప్రస్తుతం హిరానీ అభిమానులతో పాటూ కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందట. షారుఖ్ తో రాజ్ కుమార్ హిరానీ చిత్రం అంటూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా ఇప్పుడు కన్ ఫర్మ్ గా షెడ్యూల్స్ గురించిన సమాచారం వినిపిస్తోంది…లాక్ డౌన్ వల్ల…
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘తుఫాన్’. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ‘భాగ్ మిల్ఖా భాగ్’ తర్వాత ఫర్హాన్ అక్తర్- రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో ‘తుఫాన్’ పై భారీ అంచనాలు వున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను జూన్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పరేశ్ రావల్, మృణాల్ ఠాకుర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ…
గత కొంత కాలంగా, బాలీవుడ్ లో ఎవరైనా, దారుణంగా ట్రోలింగ్ ఎదురుకుంటున్నారంటే…. అది కరణ్ జోహరే! సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నెటిజన్స్ ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు. నెపోటిజమ్ పేరుతో కరణ్ ని నానా తిట్లు తిట్టిపోశారు. అయితే, కరోనా కాలంలో కరణ్ ని ట్రోల్ చేయటం ఇంకా సొషల్ మీడియాలో మానటం లేదు. కొనసాగుతూనే ఉంది. తాజాగా కార్తీక్ ఆర్యన్ వ్యవహారంలోనూ కరణ్ జోహర్ విలన్ అయ్యాడు. Read Also: ‘’అందరూ…
బాబిల్ ఖాన్… క్యాన్సర్ తో మరణించిన టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ తనయుడు. ఇన్నాళ్లూ లండన్ లో ఫిల్మ్ కోర్స్ చదువుతున్నాడు. అయితే, తాజాగా ఆయన తన ఫిల్మ్ బీఏ కోర్స్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తాను డ్రాప్ అవుట్ అవుతున్నట్టుగా బాబిల్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు. తన ఆప్త మిత్రులు ఇంత కాలం అండగా ఉన్నారనీ, వారికి కృతజ్ఞతలు అంటూ… తన మనసులోని మాటల్ని బయటపెట్టాడు. అంతే కాదు, ఇక మీద…