Boat Capsizes: మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలోని తూర్పు ప్రాంతంలోని కివు సరస్సులో గురువారం వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో 78 మంది మరణించారు. ఈ మేరకు స్థానిక అధికారి ఒకరు సమాచారం అందించారు. ఘటన సమయంలో 278 మంది ఉన్నారని.. దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురుస్సీ తెలిపారు. ఘటనలో 78 మంది మరణించారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. Somireddy Chandramohan Reddy…
ఆఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. మౌరిటానియాలో సముద్రం మధ్యలో బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ తప్పిపోయినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM), స్థానిక వర్గాలు బుధవారం తెలిపింది.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మౌరిటానియా తీరంలో పడవ బోల్తా పడటంతో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. వలసదారులు యూరప్కు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. నైరుతి మౌరిటానియాలోని ఎన్డియాగోకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ తీరంలో పడవ బోల్తా పడింది.
Boat Capsizes: బీహార్ రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చప్రాలో సరయూ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలు వెలికితీశారు. మరో 15 మంది కోసం గాలిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు.
Greece: వలసదారులతో వెళ్తున్న పడవ మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. గ్రీస్ తీరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో 78 మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు. పెలోపొన్నీస్ తీరానికి సమీపంలోని పైలోస్ పట్టణానికి నైరుతి దిశలో 87 కిలోమీటర్లు దూరంలో అంతర్జాతీయ జలాల్లో పడవ బోల్తా పడిందని గ్రీక్ కోస్ట్గార్డ్ తెలిపింది.
Boat Capsized : మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. బుల్దానా జిల్లా మెహకర్ తాలూకాలోని అంత్రి దేశ్ముఖ్ వద్ద పంగంగా నదిలో మహిళా కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందింది.
Boat capsize : పాకిస్తాన్ లో విద్యార్థుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. బోటు బోల్తాపడి పదిమంది స్టూడెంట్స్ మరణించారు. స్థానిక మదర్సాకు చెందిన 25 మంది వరకు విద్యార్థులు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక డే ట్రిప్ కోసం వెళ్లారు.