Boat Capsizes: మౌరిటానియా తీరంలో పడవ బోల్తా.. 89 మంది మృతి
- మౌరిటానియా తీరంలో పడవ బోల్తా పడి 89 మంది మృతి
- వలసదారులు యూరప్కు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Capsizes: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మౌరిటానియా తీరంలో పడవ బోల్తా పడటంతో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. వలసదారులు యూరప్కు వెళ్లేందుకు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. నైరుతి మౌరిటానియాలోని ఎన్డియాగోకు నాలుగు కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ తీరంలో పడవ బోల్తా పడింది. 89 మంది అక్రమ వలసదారుల మృతదేహాలను మౌరిటానియన్ తీర రక్షకులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. 6 రోజుల క్రితం సెనెగల్-గాంబియా సరిహద్దు నుంచి యూరప్ వైపు బయలుదేరిన పడవలో 170 మంది వలసదారులు ఉన్నారు. ఐదేళ్ల బాలికతో సహా తొమ్మిది మందిని కోస్ట్ గార్డులు రక్షించారు. 70 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. వీరి కోసం పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also: UK Elections: బ్రిటన్ ప్రజలు లేబర్ పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు?
Also Read
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
- Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
అట్లాంటిక్ను దాటి ఐరోపాకు వెళ్లేందుకు ప్రతిరోజూ వందలాది మంది ఈ ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారు. మధ్యధరా ప్రాంతంలో భారీ భద్రతను ప్రవేశపెట్టిన తరువాత అట్లాంటిక్ మార్గం గుండా వలసలు విస్తృతంగా పెరిగాయి. ఈ ప్రమాదకరమైన సముద్ర ప్రయాణానికి పనికిరాని చెక్క పడవలు వినియోగిస్తున్నారు. పడవల నిండా మనుషులు, సరిపడా నీరు, ఆహారం లేకుండా ప్రమాదానికి గురవుతున్నారు. స్పానిష్ స్వచ్ఛంద సంస్థ కామినారో ఫ్రాంటెరాస్ ప్రకారం, ఈ సంవత్సరం సముద్రం దాటి స్పెయిన్కు వెళ్లే ప్రయత్నంలో 5,000 మందికి పైగా వలసదారులు మరణించారు. ఇక్కడ ప్రతిరోజూ 33 మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.
యెమెన్, ఆఫ్ఘనిస్థాన్లో ప్రమాదాలు
ఇంతకు ముందు యెమెన్, ఆఫ్ఘనిస్తాన్లలో ఇలాంటి రెండు పెద్ద ప్రమాదాలు జరిగాయి. యెమెన్లోని అడెన్ నగరానికి సమీపంలో తీరంలో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 45 మందికి పైగా మరణించారు. సుమారు 140 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇప్పటి వరకు కనుగొనబడలేదు. ప్రమాదంలో బాధితులు హార్న్ ఆఫ్ ఆఫ్రికాకు చెందినవారు. ఎర్ర సముద్రం దాటడానికి ప్రయత్నిస్తుండగా.. కానీ సుడిగుండంలో చిక్కుకుని సముద్రంలో గల్లంయ్యారు. పని కోసం సౌదీ అరేబియా చేరుకోవడానికి తరచుగా వలస కార్మికులు తూర్పు మార్గంలో ప్రయాణిస్తారు. వారు యెమెన్లోని ఎర్ర సముద్రం దాటడానికి ప్రయత్నిస్తారు. కానీ సుడిగుండంలో చిక్కుకుని నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతారు. యెమెన్లో ప్రమాదాన్ని మరువకముందే, ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ చూసి షాక్ అయిన అనిల్ రావిపూడి.. చరణ్ లుక్పై భారీ ప్రశంసలు!
-
PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
-
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
-
Manchu Manoj: మనోజ్కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?