జగన్ ఎప్పుడు జైలుకు పోతారో తెలియదని..రాబోయేది జగన్ కు ఒడిదుడుకుల సమయమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. జగనే కాకుండా ఎవరు ఎప్పుడు జైలుకు వెళతారో తెలియదని పేర్కొన్నారు. ఎప్పుడూ వినని వందల రకాల మద్యం బ్రాండ్స్ వున్నాయని… అడిగే వాడే లేడని పెంచి అమ్ముతున్నారని మండిపడ్డారు. మద్యం ప్రియులను దోచేస్తూ వారి నుంచి వచ్చే డబ్బులతో ప్రభుత్వం నడుపుతున్నారు..కొన్న దానికన్నా పది రెట్లు ఎక్కువ చేసి మద్యాన్ని అమ్ముతున్నారని ఆగ్రహం…
ప్రతిపక్షాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ఇది వైసీపీకి అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరమని, బీజేపీకి మద్యపాన సంవత్సరమని, జనసేనకు ప్యాకేజీ నామ సంవత్సరం అని మొత్తంగా విపక్షాలకు ఏడుపునామ సంవత్సరమని అంబటి వ్యాఖ్యానించారు. అమరావతి ఇక్కడే ఉంటుందన్నారు. బీజేపీ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీనా జూదం పార్టీనా? జిన్నా టవర్ను పేల్చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో బుద్ధుడి విగ్రహాన్ని…
ఏపీ రాజకీయాలు బీజేపీ నేత సోమువీర్రాజు లిక్కర్ గురించి మాట్లాడిన మాటలపై నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఒక హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని బహిరంగగానే విమర్శిస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి దీనిపై తనదైన స్టైల్లో విమర్శల బాణాలు సంధించారు. Read Also: చెప్పులపై జీఎస్టీ వేయడమేంటి..?: నారాయణ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ర్టంలో వేరే పార్టీలను ఆదరించే పరిస్థితి లేదని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ గారి సంక్షేమ…
చీప్ లిక్కర్పై తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ.70కే చీప్ లిక్కర్ అందిస్తాం.. ఆర్థిక పరిస్థితి మెరుగైతే రూ.50కే అమ్ముతామంటూ ప్రకటించారు.. అయితే, దీనిపై పెద్ద రచ్చే జరిగింది.. ఇదేనా బీజేపీ విధానం అంటూ సోషల్ మీడియా వేదికగా పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీపై దుమ్మెత్తిపోశారు.. ఆయన సోమువీర్రాజు కాదు.. సారాయి వీర్రాజు అంటూ సెటైర్లు వేశారు.. అయితే, మరోసారి…
తెలంగాణలో ఉద్యోగుల బదిలీపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ గవర్నర్ తమిళసైని కలిసి ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై గవర్నర్తో బండి సంజయ్ బృందం చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం బిజీ గా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.. అందుకే గవర్నర్ ని కలిసామని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడే…
తర్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తు ముందుగానే ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ఈజోరు హోరందుకుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ పార్టీల మధ్య ప్రముఖంగా పోరు ఉండనుంది. ఇదిలా ఉంటే గురువారం ఉత్తరాఖండ్లో రూ.17,500 కోట్ల విలువైన 23 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. Read Also:కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న బంగారం ధర అక్కడ బహిరంగ…
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్కు మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏక్ నిరంజన్లా నిర్ణయాలు తీసుకుంటూ తుగ్లక్లా…
గుంటూరు నగరంలోని జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దేశద్రోహుల పేర్లు ఎక్కడున్నా తొలగించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరిట టవర్తో పాటు ఆ ప్రాంతానికి జిన్నా పేరు ఎలా కొనసాగిస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. దేశ విభజనకు కారణమైన వ్యక్తి పేరు ఇంకా కొనసాగటం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై స్పందించిన మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్, బీజేపీ నేత విఠల్ మాట్లాడుతూ.. మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ గా చెప్తున్న, 1 లక్ష 32 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాట అబద్ధం అని ఆయన అన్నారు. ఏడేళ్లలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది 32 వేల ఉద్యోగాలేనని, కేసిఆర్ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నడని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు…
ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీపీఎం పార్టీపై చేసిన వ్యాఖ్యలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు కౌంటర్ ఇచ్చారు. చీప్ లిక్కరుపై బీజేపీకి అంత మోజు ఉంటే వాళ్ల ఆఫీసుల ముందు పెట్టి అమ్ముకోవచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. చీప్ రాజకీయాలు చేసి ప్రజల దృష్టిని మద్యంపై మళ్లించే ప్రయత్నం చేస్తున్న బీజేపీని విధానాలను ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. కమ్యూనిస్టులు పెరుగుతున్నారనే నిస్పృహ సోము వీర్రాజు మాటల్లో కన్పిస్తోందని, తమతో సఖ్యతగా…