రాముల వారి పై ఒట్టేసి ఇచ్చిన హామీలు.. ఏ ఏడాది ఆగస్టున నెరవేస్తారో చెప్పాలని మాజీ ఎంపీ కవిత కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటల కే గ్యారెంటీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మానుకోట సభ దానికి నిదర్శనమన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు.. కాబట్టి మీ సభలకు దిక్కు దివాన లేదన్నారు.
Nitin Gadkari: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఉన్నట్లుండి ఎన్నికల వేదికపైనే కుప్పకూలారు. వేసవి వేడి ధాటికి గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు.
Akhilesh Yadav: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ లోక్సభ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. మరోసారికి పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నుంచే పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నేత రామ్గోపాల్ యాదవ్ తెలిపారు.
CDS: రాహుల్ గాంధీ చేసిన ‘‘సందప పునర్విభజన’’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చకు దారితీశాయి. బీజేపీతో పాటు ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాఖ్యల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే, వివాదం మరింత ముదరడంతో కాంగ్రెస్ దీనిని అరికట్టే ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. లోక్ సభ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేంద్రంపై విరుచుకు పడుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమేరకు నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
Maheshwar Reddy: సీఎం 14 స్థానాలు గెలుస్తామంటున్నారు..గెల్వలేరు అని నేను సవాల్ విసిరినా స్పందించడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
B.Vinod Kumar: బండి సంజయ్ 5 ఏళ్లలో 5 రూపాయలు తీసుకురాలేదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయిని పల్లి వినోద్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో బోయిని పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..
ష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి అప్పగించిన విషయం తెలిసిందే. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ సీటు తనకే కావాలని పట్టుపట్టడంతో నేతలు దిగివచ్చారు. అతడితో ఎన్నిమంతనాలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.
జై భీమ్ స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. తన భార్య వలన క్రిస్ట్మస్ చేసుకుంటానన్నారు.
PM Modi: రాజస్థాన్ బన్స్వారా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘‘చొరబాటుదారులకు’’, ‘‘ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి’’ పంచుతోందని, ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.