T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా సెమీస్కు చేరే ఒకే ఒక మార్గం
T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది.. దీంతో, లెక్కలు మారిపోయాయి.. వరల్డ్కప్లో టీమ్ ఇండియా ప్రయాణం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం భారత సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (NRR) -3.00 కంటే తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
* వెస్టిండీస్ దెబ్బ.. రన్ రేట్ కష్టాలు!
ఒకవైపు భారత్ భారీ ఓటమితో కుదేలైతే, మరోవైపు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి తన రన్ రేట్ను +5.00 దాటించింది. దీనివల్ల రన్ రేట్ పరంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలను భారత్ అధిగమించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
Also Read
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
- Sanju Samson: టీ20 వరల్డ్కప్లో కెప్టెన్ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్..! ఆ సీక్రెట్ను లీక్ చేసిన సూర్య..
* భారత్ ముందున్న ఏకైక మార్గం (1):
నెట్ రన్ రేట్ గందరగోళం లేకుండా భారత్ సెమీస్కు వెళ్లాలంటే ఇలా జరగాలి..
– భారత్ తన తదుపరి రెండు మ్యాచ్ల్లో (జింబాబ్వే మరియు వెస్టిండీస్) తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాలి.. అదే సమయంలో, దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ను ఓడించాలి.
– ఒకవేళ దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్ల్లో గెలిస్తే అది 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటుంది. అప్పుడు భారత్ తన రెండు మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో సెమీస్కు చేరుకుంటుంది.
* మరో క్లిష్టమైన మార్గం (2)
ఒకవేళ వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించినట్లయితే.. జింబాబ్వే జట్టు దక్షిణాఫ్రికాను ఓడించాలని మనం కోరుకోవాలి. అప్పుడు దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో ఆగిపోతుంది. భారత్ తన రెండు మ్యాచ్లు గెలిస్తే 4 పాయింట్లతో వెస్టిండీస్తో కలిసి సెమీస్కు వెళ్తుంది.
రేపే నిర్ణయాత్మక మ్యాచ్..
గురువారం జరగబోయే మ్యాచ్లు సెమీఫైనల్ రేసును ఖరారు చేయనున్నాయి. దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ మ్యాచ్ ఫలితం మొదట వస్తుంది. ఆ తర్వాతే భారత్ vs జింబాబ్వే మ్యాచ్ జరుగుతుంది. అంటే భారత్ మైదానంలోకి దిగే సమయానికి తాము సెమీస్ రేసులో ఉండాలంటే ఎంత తేడాతో గెలవాలి.. లేదా ఏ సమీకరణం పని చేస్తుందనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది. మొత్తంగా ప్రస్తుతానికి రన్ రేట్ గురించి ఆలోచించడం కంటే, జింబాబ్వే మరియు వెస్టిండీస్లపై భారీ విజయాలు నమోదు చేయడమే టీమ్ ఇండియా ముందున్న ఏకైక లక్ష్యం.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!