T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా సెమీస్కు చేరే ఒకే ఒక మార్గం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది.. దీంతో, లెక్కలు మారిపోయాయి.. వరల్డ్కప్లో టీమ్ ఇండియా ప్రయాణం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం భారత సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (NRR) -3.00 కంటే తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
* వెస్టిండీస్ దెబ్బ.. రన్ రేట్ కష్టాలు!
ఒకవైపు భారత్ భారీ ఓటమితో కుదేలైతే, మరోవైపు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి తన రన్ రేట్ను +5.00 దాటించింది. దీనివల్ల రన్ రేట్ పరంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలను భారత్ అధిగమించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
* భారత్ ముందున్న ఏకైక మార్గం (1):
నెట్ రన్ రేట్ గందరగోళం లేకుండా భారత్ సెమీస్కు వెళ్లాలంటే ఇలా జరగాలి..
– భారత్ తన తదుపరి రెండు మ్యాచ్ల్లో (జింబాబ్వే మరియు వెస్టిండీస్) తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాలి.. అదే సమయంలో, దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ను ఓడించాలి.
– ఒకవేళ దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్ల్లో గెలిస్తే అది 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటుంది. అప్పుడు భారత్ తన రెండు మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో సెమీస్కు చేరుకుంటుంది.
* మరో క్లిష్టమైన మార్గం (2)
ఒకవేళ వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించినట్లయితే.. జింబాబ్వే జట్టు దక్షిణాఫ్రికాను ఓడించాలని మనం కోరుకోవాలి. అప్పుడు దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో ఆగిపోతుంది. భారత్ తన రెండు మ్యాచ్లు గెలిస్తే 4 పాయింట్లతో వెస్టిండీస్తో కలిసి సెమీస్కు వెళ్తుంది.
రేపే నిర్ణయాత్మక మ్యాచ్..
గురువారం జరగబోయే మ్యాచ్లు సెమీఫైనల్ రేసును ఖరారు చేయనున్నాయి. దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ మ్యాచ్ ఫలితం మొదట వస్తుంది. ఆ తర్వాతే భారత్ vs జింబాబ్వే మ్యాచ్ జరుగుతుంది. అంటే భారత్ మైదానంలోకి దిగే సమయానికి తాము సెమీస్ రేసులో ఉండాలంటే ఎంత తేడాతో గెలవాలి.. లేదా ఏ సమీకరణం పని చేస్తుందనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది. మొత్తంగా ప్రస్తుతానికి రన్ రేట్ గురించి ఆలోచించడం కంటే, జింబాబ్వే మరియు వెస్టిండీస్లపై భారీ విజయాలు నమోదు చేయడమే టీమ్ ఇండియా ముందున్న ఏకైక లక్ష్యం.
తాజావార్తలు
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?