T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా సెమీస్కు చేరే ఒకే ఒక మార్గం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది.. దీంతో, లెక్కలు మారిపోయాయి.. వరల్డ్కప్లో టీమ్ ఇండియా ప్రయాణం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం భారత సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (NRR) -3.00 కంటే తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
* వెస్టిండీస్ దెబ్బ.. రన్ రేట్ కష్టాలు!
ఒకవైపు భారత్ భారీ ఓటమితో కుదేలైతే, మరోవైపు వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై 107 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి తన రన్ రేట్ను +5.00 దాటించింది. దీనివల్ల రన్ రేట్ పరంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలను భారత్ అధిగమించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
* భారత్ ముందున్న ఏకైక మార్గం (1):
నెట్ రన్ రేట్ గందరగోళం లేకుండా భారత్ సెమీస్కు వెళ్లాలంటే ఇలా జరగాలి..
– భారత్ తన తదుపరి రెండు మ్యాచ్ల్లో (జింబాబ్వే మరియు వెస్టిండీస్) తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాలి.. అదే సమయంలో, దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ను ఓడించాలి.
– ఒకవేళ దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్ల్లో గెలిస్తే అది 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటుంది. అప్పుడు భారత్ తన రెండు మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో సెమీస్కు చేరుకుంటుంది.
* మరో క్లిష్టమైన మార్గం (2)
ఒకవేళ వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించినట్లయితే.. జింబాబ్వే జట్టు దక్షిణాఫ్రికాను ఓడించాలని మనం కోరుకోవాలి. అప్పుడు దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో ఆగిపోతుంది. భారత్ తన రెండు మ్యాచ్లు గెలిస్తే 4 పాయింట్లతో వెస్టిండీస్తో కలిసి సెమీస్కు వెళ్తుంది.
రేపే నిర్ణయాత్మక మ్యాచ్..
గురువారం జరగబోయే మ్యాచ్లు సెమీఫైనల్ రేసును ఖరారు చేయనున్నాయి. దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ మ్యాచ్ ఫలితం మొదట వస్తుంది. ఆ తర్వాతే భారత్ vs జింబాబ్వే మ్యాచ్ జరుగుతుంది. అంటే భారత్ మైదానంలోకి దిగే సమయానికి తాము సెమీస్ రేసులో ఉండాలంటే ఎంత తేడాతో గెలవాలి.. లేదా ఏ సమీకరణం పని చేస్తుందనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది. మొత్తంగా ప్రస్తుతానికి రన్ రేట్ గురించి ఆలోచించడం కంటే, జింబాబ్వే మరియు వెస్టిండీస్లపై భారీ విజయాలు నమోదు చేయడమే టీమ్ ఇండియా ముందున్న ఏకైక లక్ష్యం.
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!