BJP: సినీనటీ మాధవీలతపై.. టీ బీజేపీ చీఫ్ కు శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక ఫిర్యాదు
- సినీనటీ మాధవీలతపై శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక ఫిర్యాదు
- ఇలాంటి వాఖ్యలు చేసిన వారికి బీజేపీమద్దతు ఉండదు
- సాయి బాబా ఆలయంలో జరిగేవి హిందూ పూజలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీనటీ, ఏపీ బీజేపీ నేత మాధవిలతపై తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై రామ చందర్ రావు మాట్లాడుతూ..
శిరిడి సాయి బాబాపై అనుచిత వాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. మనోభావాలు దెబ్బ తీయడం సరికాదు.. బాబాపై వాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదని తెలిపారు. సాయి బాబాపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాధవీ లతకు సూచించారు. ఎవరు ఇలాంటి వాఖ్యలు చేసిన వారికి బీజేపీమద్దతు ఉండదు.. ఏకీభవించదని స్పష్టం చేశారు. ఎవరైనా సరే భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు.
Also Read:Trump: ఏడాదిలోపే చైనా తినేస్తోంది.. కెనడాకు ట్రంప్ వార్నింగ్
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
సాయి బాబాపై దుష్ప్రచారం చేస్తున్న వారికి శిరిడి సాయి బాబా ఐక్య వేదిక హెచ్చరికలు జారీ చేసింది. మంచికంటి ధనుంజయ,శిరిడి సాయి భక్త ఐక్య వేదిక అధ్యక్షుడు మాట్లాడుతూ.. సాయి బాబాపై లేనిపోని మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. సాయి బాబాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆది సరికాదు.. సాయి బాబా ఆలయంలో జరిగేవి హిందూ పూజలే.. ఇంకేదో పూజలు కాదన్నారు. హిందువులను విడదీసే కుట్రలు చేయకండి.. బాబాను, బాబా భక్తులను హేళన చేయకండి అని కోరారు. హిందూ ధర్మాన్ని కూల్చే కుట్రలు చేయడం సరికాదు.. హిందూ బంధువులను చీల్చేందుకు కొంతమందికి నిధులు ఏమైనా వస్తున్నాయా..? అని ప్రశ్నించారు.
Also Read:Tamil Nadu: ఎన్నికల వేళ కీలక ఘట్టం.. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ బిల్లుకు ఆమోదం
సాయి భక్తులు సహనంతో ఉన్నారు.. సహనం కోల్పోయేలా చేయొద్దన్నారు. మీరే హిందువులు అనే భ్రమలో ఉండకండి. కట్టర్ హిందువులు సాయి భక్తులు.. సాయి బాబాను హేళన చేసిన దాంట్లో 14 మంది మీదా కేసులు పెట్టామన్నారు. మాధవీలత, భరత్ వర్ష, లలిత్ కుమార్ లు సాయి బాబాను హేళన చేయడంలో కీలకంగా ఉన్నారని తెలిపారు. రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులను కలవడం జరిగింది చర్యలు తీసుకొమ్మని కోరామని తెలిపారు. సహనంతో ఉన్నాం, రెచ్చగొట్టకండి అని కోరారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!