AIMIM in Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 కోసం ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థుల ప్రకటన జోరందుకుంది. ఇందులో భాగంగా.. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఆదివారం తమ 25 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీహార్లోని ప్రజల గొంతుకగా మారతామని ఆశిస్తున్నాం.. అంటూ ఏఐఎంఐఎం ఈ జాబితాను ‘X’ వేదికగా పంచుకుంది. ఈ జాబితాలో సివాన్ నుంచి మహ్మద్ కైఫ్, గోపాల్గంజ్ ఏసీ నుంచి అనాస్ సలామ్, కిషన్గంజ్ నుంచి…
Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రాజకీయ గందరగోళం మధ్య, పాట్నాలో నాటకీయ దృశ్యం ఆకట్టుకుంది. మధుబన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించిన మదన్ షా వింత చేష్టలతో వార్తల్లో నిలిచారు. సర్క్యులర్ రోడ్లోని 10వ నంబర్లోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం వెలుపల గందరగోళం సృష్టించారు. మదన్ షా లాలు నివాసం గేటు బయట తన…
Bihar Elections 2025: ప్రస్తుతం దేశం చూపు బీహార్ వైపు ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష కూటములకు కీలకంగా మారాయి. ఇటీవలే అధికార ఎన్డీఏ కూటమి పక్షాల సీట్ల పంపకం పూర్తి అయ్యింది. ఇప్పుడు ప్రతిపక్ష మహా కూటమి వంతు వచ్చింది. వాస్తవానికి ఈ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి కాంగ్రెస్, ఆర్జేడీ, జెఎంఎం, ఇతర పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడింది. ఈ దఫా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా…
బీహార్లో రసవత్తరంగా ఎన్నికల సమరం సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ పెంచారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్పై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ప్రధాన పార్టీలు పట్టించుకోని సమస్యలను ప్రశాంత్ కిషోర్ లేవనెత్తారని.. అయితే ఆ సమస్య పరిష్కారానికి చాలా సమయం పడుతుందని తెలిపారు.
ప్రముఖ జనపద గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అలీనగర్ ప్రజల ఆశీస్సులు తనకు స్ఫూర్తి ఇచ్చాయని.. వారి ఆశీస్సులతో విజయం సాధిస్తానని మైథిలి ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.
Bihar Elections: బీహార్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి విడతలో 121 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
బీహార్లో ప్రస్తుతం ఎన్నికల సమరం నడుస్తోంది. అంతేకాదు తొలి విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం అభ్యర్థుల ప్రకటన కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 101 మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా జేడీయూ కూడా తుది జాబితాను విడుదల చేసింది.
నిన్నామొన్నటి దాకా ఓటర్ యాత్ర పేరుతో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి బీహార్ అంతటా తిరిగాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కలలు కన్నాయి. కానీ చివరికి అంతా తుస్ మనిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.. ఓ వైపు నామినేషన్లు వేస్తున్నారు.