Bihar Elections: మజ్లిస్ పార్టీ అభ్యర్థి విందులో బిర్యానీ కోసం తన్నులాట.. వీడియో వైరల్
- బీహార్లో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
- మజ్లిస్ పార్టీ అభ్యర్థి విందులో బిర్యానీ కోసం తన్నులాట
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో ప్రస్తుతం ఎన్నికల సమరం నడుస్తోంది. అంతేకాదు తొలి విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.. విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం
Also Read
- Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్పై తీవ్ర విమర్శలు
- Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
ఇదిలా ఉంటే గురువారం బహదూర్గంజ్లో ఎంఐఎం అభ్యర్థి తౌసిఫ్ ఆలం నామినేషన్ సందర్భంగా కార్యకర్తల కోసం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. నామినేషన్ తంతు పక్కన పెట్టి బిర్యానీ కోసం ఎంఐఎం మద్దతుదారులు, జనాలు కొట్టుకున్నారు. బిర్యానీ ప్యాకెట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. ఒకరి మీద ఒకరు పడుకుంటూ ప్యాకెట్లు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Trump-Putin: 2 వారాల్లో పుతిన్ కలుస్తా.. ట్రంప్ వెల్లడి
తౌసిఫ్ ఆలం.. నామినేషన్కు ముందు నివాసంలో ప్రార్థన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తరలివచ్చిన ప్రజల కోసం బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. అయితే మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్యాకెట్లు కోసం కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. భారతీయుల దయనీయ స్థితి ఇంత దారుణంగా ఉందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అక్రమ వలసదారులు మాదిరిగా కొట్టుకుంటున్నారని.. వీరంతా భారతీయులులాగా లేనట్లున్నారే అని వ్యాఖ్యానించారు.
వీడియో వైరల్పై మజ్లిస్ పార్టీ స్పందించింది. హనుమాన్ చాలీసా తర్వాత ప్రసాదం పంపిణీ చేసినట్లే.. తాము కూడా మతచారం తర్వాత 2 వేల మందికి బిర్యానీ తయారు చేసినట్లు చెప్పుకొచ్చింది. జనసమూహం ఎక్కువగా రావడంతో తోపులాట జరిగినట్లుగా తెలిపింది.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం.. బి.ఫార్మ్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు
ఈశాన్య బీహార్లో ముస్లిం జనాభా 68 శాతం కంటే ఎక్కువ ఉన్న ఏకైక జిల్లా కిషన్గంజ్. 2019 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఓడిపోయిన ఏకైక పార్లమెంటరీ స్థానం కూడా ఇదే. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇజహరుల్ హుస్సేన్ 61,078 ఓట్లతో ఈ స్థానాన్ని గెలుచుకోగా… బీజేపీ అభ్యర్థి స్వీటీ సింగ్ 59,697 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఎంఐఎం అభ్యర్థి కమ్రుల్ హోడా 41,904 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
బీహార్ రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇండియా కూటమిలోని పార్టీలు మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నాయి.
A scene at AIMIM candidate Tausif Alam’s nomination in Bahadurganj. AIMIM supporters brawling over free biryani. A telling snapshot. Indigence rules and politics still feeds off it!
SAD. pic.twitter.com/HmOLfSgdQv
— Rahul Shivshankar (@RShivshankar) October 17, 2025
తాజావార్తలు
-
Tollywood 2026 First Half: సోసోగా ఫస్ట్ హాఫ్ ..ఆశలన్నీ సెకండాఫ్ మీదే?
-
Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
-
Karthi: కార్తి బర్త్డే ట్రీట్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్
-
KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
-
Ajinkya Rahane Captaincy: కేకేఆర్ కెప్టెన్సీ వదిలేయాలనిపించలేదా?.. ఆజింక్య రహానే ఆసక్తికర సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!