Bihar Elections: 44 మందితో తుది జాబితాను విడుదల చేసిన జేడీయూ
- 44 మందితో తుది జాబితాను విడుదల చేసిన జేడీయూ
- మొత్తం 101 స్థానాలకు అభ్యర్థులు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం అభ్యర్థుల ప్రకటన కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 101 మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా జేడీయూ కూడా తుది జాబితాను విడుదల చేసింది. బుధవారం 57 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేయగా.. గురువారం మరొకసారి 44 మందితో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. చిరాగ్ పాస్వాన్ కోరిన నాలుగు స్థానాలకు కూడా జేడీయూ అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ పరిణామం ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ట్రంప్ను చూసి మోడీ భయపడ్డారు.. రాహుల్గాంధీ ఎద్దేవా
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
నితీష్ కుమార్ పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో సోన్బార్సా, మోర్వా, ఎక్మా, రాజ్గిర్ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలను చిరాగ్ పాస్వాన్ కోరారు. ఇది ప్రస్తుతం దుమారం రేపే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ కూడా 14 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.
జేడీయూ అభ్యర్థుల జాబితాలో 37 మంది OBC అభ్యర్థులు, 22 మంది EBC అభ్యర్థులు, 22 మంది జనరల్ కేటగిరీ నుంచి, 15 మంది SC అభ్యర్థులు, ఒకరు 1 ST అభ్యర్థి ఉన్నారు. అదనంగా 4 ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది.
ఇది కూడా చదవండి: Bengaluru: వైద్య వృత్తికే మాయని మచ్చ.. భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్
2020 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మంత్రి సుమిత్ సింగ్ను ఈసారి చకై అసెంబ్లీ స్థానం నుంచి నామినేట్ చేసింది. నామినేట్ చేయబడిన ఇతర మంత్రుల్లో చైన్పూర్ స్థానం నుంచి జామా ఖాన్, అమర్పూర్ నుంచి జయంత్ రాజ్, ధమ్దాహా నుంచి లెస్సీ సింగ్ ఉన్నారు. వశిష్ఠ సింగ్ కార్గహర్ నుంచి నామినేట్ చేయగా.. బులో మండల్ గోపాల్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.


తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!