Bihar Elections: 44 మందితో తుది జాబితాను విడుదల చేసిన జేడీయూ
- 44 మందితో తుది జాబితాను విడుదల చేసిన జేడీయూ
- మొత్తం 101 స్థానాలకు అభ్యర్థులు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం అభ్యర్థుల ప్రకటన కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 101 మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా జేడీయూ కూడా తుది జాబితాను విడుదల చేసింది. బుధవారం 57 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేయగా.. గురువారం మరొకసారి 44 మందితో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. చిరాగ్ పాస్వాన్ కోరిన నాలుగు స్థానాలకు కూడా జేడీయూ అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ పరిణామం ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ట్రంప్ను చూసి మోడీ భయపడ్డారు.. రాహుల్గాంధీ ఎద్దేవా
Also Read
- PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- Rahul Gandhi-Kiren Rijiju: సభలో ఫైటింగ్.. బయట ముచ్చట్లు.. రాహుల్గాంధీ-కిరణ్ రిజిజు సరదా సంభాషణ
నితీష్ కుమార్ పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో సోన్బార్సా, మోర్వా, ఎక్మా, రాజ్గిర్ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలను చిరాగ్ పాస్వాన్ కోరారు. ఇది ప్రస్తుతం దుమారం రేపే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ కూడా 14 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.
జేడీయూ అభ్యర్థుల జాబితాలో 37 మంది OBC అభ్యర్థులు, 22 మంది EBC అభ్యర్థులు, 22 మంది జనరల్ కేటగిరీ నుంచి, 15 మంది SC అభ్యర్థులు, ఒకరు 1 ST అభ్యర్థి ఉన్నారు. అదనంగా 4 ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది.
ఇది కూడా చదవండి: Bengaluru: వైద్య వృత్తికే మాయని మచ్చ.. భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్
2020 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మంత్రి సుమిత్ సింగ్ను ఈసారి చకై అసెంబ్లీ స్థానం నుంచి నామినేట్ చేసింది. నామినేట్ చేయబడిన ఇతర మంత్రుల్లో చైన్పూర్ స్థానం నుంచి జామా ఖాన్, అమర్పూర్ నుంచి జయంత్ రాజ్, ధమ్దాహా నుంచి లెస్సీ సింగ్ ఉన్నారు. వశిష్ఠ సింగ్ కార్గహర్ నుంచి నామినేట్ చేయగా.. బులో మండల్ గోపాల్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.


తాజావార్తలు
-
Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ ‘IAM GAME’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మ్యాక్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP సెల్ఫీ కెమెరా, 10,000mAh బ్యాటరీ!
-
KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!