Bihar Elections 2025: పాపం..! టికెట్ రాకపోవడంతో కుర్తా చించుకుని.. రోడ్డుపై పడి ఏడ్చిన ఆర్జేడీ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రాజకీయ గందరగోళం మధ్య, పాట్నాలో నాటకీయ దృశ్యం ఆకట్టుకుంది. మధుబన్ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించిన మదన్ షా వింత చేష్టలతో వార్తల్లో నిలిచారు. సర్క్యులర్ రోడ్లోని 10వ నంబర్లోని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం వెలుపల గందరగోళం సృష్టించారు. మదన్ షా లాలు నివాసం గేటు బయట తన కుర్తాను చింపి, నేలపై పడుకుని, బిగ్గరగా ఏడ్చారు. సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తులు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
READ MORE: Mitchell Starc: రోహిత్కు స్టార్క్ బౌలింగ్.. 176.5 కిమీ స్పీడ్ ఏంటి సామీ?
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఆ వీడియోలో ఆర్జేడీ ప్రముఖ నాయకులు టికెట్ కోసం తనను రూ. 2.70 కోట్లు అడిగారని మదన్ షా చెబుతున్నారు. తాను డబ్బు ఇవ్వకపోవడంతో పార్టీ తన టికెట్ను రద్దు చేసి, బదులుగా డాక్టర్ సంతోష్ కుష్వాహాకు ఇచ్చిందని ఆరోపించారు. నేను పార్టీ కోసం చాలా సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నాను. కానీ టిక్కెట్లు డబ్బు ఆధారంగా పంపిణీ చేశారు. అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను విస్మరిస్తూ, డబ్బు ఉన్నవారికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని మదన్ షా అన్నారు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. యాదవ్ టిక్కెట్లను బ్రోకర్ లా అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ సంఘటన లాలూ-రబ్రీ నివాసం వెలుపల గందరగోళాన్ని సృష్టించింది. భద్రతా సిబ్బంది వెంటనే మదన్ షాను సంఘటన స్థలం నుంచి పంపించారు. ఈ ఘటనపై ఆర్జేడీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
READ MORE: Shocking News: కొండపై నుంచి దూకి బాలికల ఆత్మహత్యాయత్నం..
लालू आवास के सामने कुर्ता फाड़कर फूट-फूटकर रो पड़े मधुबन विधानसभा के पूर्व प्रत्याशी मदन साह!
मदन शाह ने संजय यादव पर टिकट बेचने का आरोप लगाया है।
राजद में टिकट बंटवारे को लेकर मचा बवाल अब खुलकर सड़कों पर आ गया है। pic.twitter.com/zyos3SppG7
— Lutyens Media (@LutyensMediaIN) October 19, 2025
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!