AIMIM in Bihar Elections: బీహార్ ఎన్నికలలో ఏఐఎంఐఎం.. 25 అభ్యర్థుల ప్రకటన.. బరిలో టీమిండియా మాజీ క్రికెటర్ .!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AIMIM in Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 కోసం ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థుల ప్రకటన జోరందుకుంది. ఇందులో భాగంగా.. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఆదివారం తమ 25 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీహార్లోని ప్రజల గొంతుకగా మారతామని ఆశిస్తున్నాం.. అంటూ ఏఐఎంఐఎం ఈ జాబితాను ‘X’ వేదికగా పంచుకుంది. ఈ జాబితాలో సివాన్ నుంచి మహ్మద్ కైఫ్, గోపాల్గంజ్ ఏసీ నుంచి అనాస్ సలామ్, కిషన్గంజ్ నుంచి అడ్వకేట్ షమ్స్ ఆగాజ్, మధుబని నుంచి రషీద్ ఖలీల్ అన్సారీ, అరారియా నుంచి మొహమ్మద్ మంజూర్ ఆలం వంటి 25 మంది పేర్లు ఉన్నాయి.
Mitchell Starc: రోహిత్కు స్టార్క్ బౌలింగ్.. 176.5 కిమీ స్పీడ్ ఏంటి సామీ?
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ అభ్యర్థుల జాబితాలను దశలవారీగా విడుదల చేస్తోంది. శనివారం నాడు కాంగ్రెస్ తమ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నర్కటియాగంజ్, కిషన్గంజ్, కస్బా, పూర్నియా, గయా టౌన్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నర్కటియాగంజ్ నుంచి శాశ్వత్ కేదార్ పాండే, కిషన్గంజ్ నుంచి కమ్రూల్ హోడా పోటీ చేయనున్నారు. అలాగే, కస్బా నుంచి ఇర్ఫాన్ ఆలం, పూర్నియా నుంచి జితేందర్ యాదవ్, గయా టౌన్ నియోజకవర్గం నుంచి మోహన్ శ్రీవాస్తవ బరిలో దిగనున్నారు. అంతకుముందు అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ తమ మొదటి జాబితాలో మొత్తం 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో 24 మంది మొదటి దశ ఎన్నికల్లో, మిగిలిన 24 మంది రెండో దశ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Shocking News: కొండపై నుంచి దూకి బాలికల ఆత్మహత్యాయత్నం..
బీహార్ ఎన్నికలలో నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సారథ్యంలోని ఇండియా కూటమి ప్రధానంగా తలపడనున్నాయి. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసేనాటికి కూడా ఆర్జేడీ, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్న మహాకూటమి మొదటి దశకు సీట్ల పంపకాన్ని ఖరారు చేయలేకపోయింది. ఫలితంగా కొన్ని సీట్లలో స్నేహపూర్వక పోరు జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్, అతని పార్టీ జన్ సూరాజ్ రూపంలో కొత్త పార్టీ కూడా రంగ ప్రవేశం చేయనుంది.
बिहार विधानसभा चुनाव के AIMIM प्रत्याशियों के नाम कुछ इस तरह हैं। इंशाअल्लाह उम्मीद है कि हम बिहार के सबसे मज़लूम लोगों की आवाज़ बनेंगे। यह सूची AIMIM बिहार यूनिट ने तैयार की है और इस सिलसिले में पार्टी की क़ौमी कियादत से भी मशविरा किया गया है।
We are happy to announce the list… pic.twitter.com/9ec1t4KpR2
— AIMIM (@aimim_national) October 19, 2025
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!