భారత ఫెన్సర్ భవానీ దేవి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్లో తొలిసారిగా మెడల్ సాధించిన తొలి ఇండియన్ ఫెన్సర్గా భవానీ చరిత్రకెక్కింది. చైనాలో జరిగిన ఈ పోటీలో మహిళల సాబెర్ విభాగంలో ఆమె కాంస్య పతకం గెలుపొందింది. సోమవారం హోరాహోరీగా సాగిన సెమీస్ లో భవాని 14-15 తేడాతో జేనబ్ దాయిబెకోవా(ఉబ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడింది.
ఆమె ఓ వివాహిత.. తొలుత సరదా కోసం ఆన్లైన్ రమ్మీ ఆడటం మొదలుపెట్టింది.. తర్వాత అది అలవాటైంది.. అనంతరం ఆ ఆటకి బానిసైంది. ఎంతలా అంటే.. లక్షల్లో అప్పులు చేసింది. నగలు కూడా విక్రయించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. చివరికి ఆ భారం భరించలేక.. ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చావడిలోని ఓ హెల్త్ కేర్ సంస్థలో పని చేస్తోన్న భాగ్యరాజ్ కందన్.. ఆరేళ్ల క్రితం భవాని(29)ని ప్రేమించి…