సమాజంలో మహిళలను బతకనివ్వడం లేదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడవలేకపోతోంది. ప్రేమిస్తే పెద్దవాళ్ళు చంపేస్తున్నారు.. పెళ్లి చేసుకొంటే భర్త చంపేస్తున్నాడు.. ప్రేమించమని ప్రేమోన్మాదులు చంపేస్తున్నారు. ఇలా ఎక్కడా ఒక మహిళకు రక్షణ లేకుండా పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది ఆ అమ్మాయి కల.
Bengaluru: బెంగళూర్ నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ 600 మందికి పైగా విదేశీయులు తిష్ట వేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరందరినీ వారి దేశాలకు వాపసు పంపేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్కు చెందిన యువతిని ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడు వివాహమాడి బెంగళూరులో కాపురం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చాక నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాక్ యువతిని స్వదేశానికి తిప్పి పంపిన తరహాలోనే నగరంలో తిష్టవేసిన ఆఫ్రికా దేశాలకు చెందిన వారిని…
Pakistan Girl : ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. దేశాన్ని దాటుకుని వచ్చి అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తన మతం తెలియకుండా ఉండేందుకు భర్త కోసం తన పేరు కూడా మార్చుకుంది.
Bengaluru world’s second-most traffic congested city: ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక రద్దీ ఉన్న నగరాల జాబితాలో బెంగళూర్ చోటు సంపాదించుకుంది. లండన్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరంగా బెంగళూర్ నిలిచింది. టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యధిక రద్దీ ఉన్న నగరాలకు ర్యాంకింగ్స్ కేటాయించింది. భారత్ నుంచి బెంగళూర్ రెండో స్థానంలో నిలవగా.. పూణే 6వ స్థానంలో, న్యూఢిల్లీ 34వ స్థానంలో, ముంబై 47వ స్థానంలో ఉన్నాయి
Aero India 2023: అమృత మహోత్సవం నుంచి అమృత కాలంలోకి ప్రవేశిస్తున్న భారతదేశం మేకిన్ ఇండియా ద్వారా స్థానికంగా ఉత్పత్తులను పెంచుకోవాలని ఆశిస్తోంది. సోవియెట్ కాలం నాటి పరికరాలను ఆధునికీకరించుకోవాలని కృషి చేస్తోంది. దేశీయ విమానయాన సంస్థలు తమ ఫ్లైట్ల సంఖ్యను భారీగా పెంచుకోవాలని కోరుకుంటున్నాయి. ఈ మేరకు విదేశీ సంస్థలకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు కూడా పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
IT, Engineering Recruitment: ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులు చదివిన అభ్యర్థులకు సువర్ణావకాశం. ఎయిర్బస్ సంస్థ ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో బెంగళూరులో మీట్ అండ్ గ్రీట్ అనే ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఏరో ఇండియా-2023 ఎయిర్షో సందర్భంగా ఈ నియామక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఆశావహులు ఆ సంస్థ అధికారులను కలిసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
ఆసియాలోనే అతిపెద్ద ఏరో ఇండియా-2023 ప్రదర్శనను బెంగళూరు శివారులోని యలహంకలో ప్రారంభమైంది. యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 14వ ఎడిషన్ ఏరో ఇండియా-2023 ప్రదర్శనను ప్రారంభించారు.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్, అల్ఖైదాతో సంబంధాలున్న కొందరు అనుమానితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం ముంబై, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Man Beaten To Death For Chatting With Girl: బెంగళూర్ లో దారుణం జరిగింది. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. మృతుడిని గోవిందరాజుగా గుర్తించినట్లు, హత్యకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. నిందితులు అనిల్, లోహిత్, భరత్, కిషోర్గా గుర్తించారు. ప్రధాన నిందితుడు అనిల్ ఆదివారం ఉదయం గోవిందరాజును ఇంటి నుంచి బయటకు పిలిచి బైక్ పై ఆండ్రల్లికి తీసుకెళ్లినట్లుగా అధికారులు…