West Bengal: 20 ఏళ్లుగా స్కూల్లో హిందువులు, ముస్లింలకు వేర్వేరు భోజనం.. చివరకు ఈ విధానం రద్దు..
- 20 ఏళ్ల విధానానికి స్వస్తి పలికిన బెంగాల్ స్కూల్..
- హిందూ, ముస్లిం విద్యార్థులకు విడివిడిగా భోజనం..
- విమర్శలు రావడంతో ఈ పద్ధతి రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో గత 20 ఏళ్లుగా ప్రభుత్వం నిర్వహణలోని ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న ఆచారానికి స్వస్తి పలికారు. రెండు దశాబ్దాల తర్వాత హిందూ, ముస్లిం విద్యార్థులు తొలిసారిగా కలిసి బుధవారం మధ్యాహ్న భోజనం చేశారు. వివిధ మతాల విద్యార్థులకు వేర్వేరు భోజనం వడ్డిస్తున్న ఏళ్ల తరబడి ఆచారంపై విమర్శలు రావడంతో ఈ విధానాన్ని రద్దు చేసింది.
రెండు దశాబ్దాలుగా హిందూ, ముస్లిం విద్యార్థులు విడివిడిగా మధ్యాహ్న భోజనం అనే విధానం సోషల్ మీడియాలో విస్తృత ఆగ్రహానికి దారి తీసింది. మీడియా కూడా ఈ వార్తను హైలెట్ చేయడంతో బుధవారం ఈ పద్ధతికి స్వస్తి చెప్పారు. ఈ సంఘటన బెంగాల్లోని పూర్బ బర్ధమాన్ జిల్లాలోని నాదన్ ఘాట్ ప్రాంతంలోని కిషోరిగంజ్ మన్మోహన్ పూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
Read Also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంసలు
విద్యార్థుల మధ్య విభజనకు దారి తీసే ఈ ఆచారంపై పాఠశాల అధికారులు ఈ వారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వివక్షతో కూడిన ఆచారాన్ని ముగించాలని ఏకగ్రీవంగా అంగీకరించారు. భోజనం విషయంలో వేర్వేరుగా ఉంటున్నా, విద్యార్థులు అంతా కలిసి క్లాసులకు హాజరవుతారు. ఒకే బెంచీపై కూర్చొంటారు.
హిందూ విద్యార్థులకు హిందూ వంటవాడు వండిన ఆహారాన్ని వడ్డించగా, ముస్లిం విద్యార్థులకు వారి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి తయారుచేసిన భోజనం ఇచ్చేవారు. రెండు గ్రూపులకు వేర్వేరు సెట్ల ప్లేట్లు, గిన్నెలు, స్పూన్లు, అలాగే వేర్వేరు గ్యాస్ స్టవ్లు,ఓవెన్లను ఉపయోగించారు. గతంలో ఈ విధానంపై ప్రిన్సిపాల్ కూడా నిస్సహాయతను వ్యక్తం చేశారు. దీని వల్ల ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని చెప్పారు. మొత్తం మీద ఈ వివాదంపై జిల్లా కలెక్టర్ ఎంక్వైరీకి ఆదేశించారు. ప్రస్తుతం, బుధవారం నుంచి ఈ విధానం రద్దు అయింది.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!