Messi row: మెస్సీ పర్యటన వైఫల్యం.. క్రీడామంత్రి రాజీనామా, అధికారులకు నోటీసులు..
- కోల్కతా మెస్సీ ఈవెంట్ గందరగోళం..
- బెంగాల్ టీఎంసీ ప్రభుత్వంలో ప్రకంపనలు..
- క్రీడా మంత్రి రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Messi row: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోల్కతాలో మెస్సీ పర్యటనలో వైఫల్యం అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంచలనంగా మారింది. విపక్షాల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రభుత్వం, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపారు. దీనిని ఆమె ఆమోదించారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూసేందుకు రాజీనామా చేస్తున్నట్లు బిశ్వాస్ చెప్పారు. ప్రస్తుతం ఈ శాఖను సీఎం మమతా బెనర్జీ చూడనుంది.
Read Also: Rupee vs Dollar: డాలర్తో పోల్చితే రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. కారణాలు ఇవే!
Also Read
- Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
శనివారం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పర్యటన సందర్భంగా తీవ్ర గందరగోళం, హింస తెలెత్తింది. మెస్సీ G.O.A.T ఇండియా పర్యటనలో భాగంగా కోల్కతా వచ్చిన సందర్భంలో, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు మెస్సీ చుట్టూ అధికారులు, రాజకీయ నాయకులు గుమిగూడటంపై అభిమానులు, సాధారణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో ఉన్న ప్రేక్షకులు స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు, టెంట్లు విసిరేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర క్రీడా మంత్రి రాజీనామా చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ రాజీవ్ కుమార్, బిధాన్ నగర్ పోలీస్ కమిషనర్ ముఖేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్నేష్ సర్కార్, క్రీడలు మరియు యువజన వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ సిన్హాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడుగా భావించే క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్, మెస్సీ పర్యనటలో, మెస్సీ చుట్టూ ఉంటూ అతడి కుటుంబ సభ్యులతో ఫోటోలు తీయించారని అభిమానులు ఆరోపించారు. తాము వేల రూపాయలతో టికెట్ కొని స్టేడియానికి వస్తే కనీసం మెన్సీని చూడనీయకుండా చేశారని అన్నారు. ఈ ఘటనపై ప్రేక్షకులకు మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిర్వహణ లోపాలతో తీవ్రంగా కలత చెందానని, దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.
తాజావార్తలు
-
Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
-
Raidurg Land: రాయదుర్గం TGIIC భూమికి జాక్పాట్.. ఎకరం రూ.264 కోట్లు.!
-
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!