Messi row: మెస్సీ పర్యటన వైఫల్యం.. క్రీడామంత్రి రాజీనామా, అధికారులకు నోటీసులు..
- కోల్కతా మెస్సీ ఈవెంట్ గందరగోళం..
- బెంగాల్ టీఎంసీ ప్రభుత్వంలో ప్రకంపనలు..
- క్రీడా మంత్రి రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Messi row: ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోల్కతాలో మెస్సీ పర్యటనలో వైఫల్యం అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంచలనంగా మారింది. విపక్షాల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రభుత్వం, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపారు. దీనిని ఆమె ఆమోదించారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూసేందుకు రాజీనామా చేస్తున్నట్లు బిశ్వాస్ చెప్పారు. ప్రస్తుతం ఈ శాఖను సీఎం మమతా బెనర్జీ చూడనుంది.
Read Also: Rupee vs Dollar: డాలర్తో పోల్చితే రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. కారణాలు ఇవే!
Also Read
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
శనివారం కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పర్యటన సందర్భంగా తీవ్ర గందరగోళం, హింస తెలెత్తింది. మెస్సీ G.O.A.T ఇండియా పర్యటనలో భాగంగా కోల్కతా వచ్చిన సందర్భంలో, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు మెస్సీ చుట్టూ అధికారులు, రాజకీయ నాయకులు గుమిగూడటంపై అభిమానులు, సాధారణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో ఉన్న ప్రేక్షకులు స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు, టెంట్లు విసిరేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర క్రీడా మంత్రి రాజీనామా చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ రాజీవ్ కుమార్, బిధాన్ నగర్ పోలీస్ కమిషనర్ ముఖేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్నేష్ సర్కార్, క్రీడలు మరియు యువజన వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ సిన్హాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడుగా భావించే క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్, మెస్సీ పర్యనటలో, మెస్సీ చుట్టూ ఉంటూ అతడి కుటుంబ సభ్యులతో ఫోటోలు తీయించారని అభిమానులు ఆరోపించారు. తాము వేల రూపాయలతో టికెట్ కొని స్టేడియానికి వస్తే కనీసం మెన్సీని చూడనీయకుండా చేశారని అన్నారు. ఈ ఘటనపై ప్రేక్షకులకు మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిర్వహణ లోపాలతో తీవ్రంగా కలత చెందానని, దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!