స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మెట్రో సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 15 ఉదయం 4 గంటలకే సర్వీసులు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో సంస్థ ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రజల సౌలభ్యం కోసం ఈ సర్వీసుల్లో మార్పులు చేసినట్లు ఢిల్లీ మెట్రో ప్రకటన చేసింది.