PM Sheikh Hasina India Visit: బంగ్లాదేశ్, భారత కీలక భాగస్వామి: ప్రధాని నరేంద్ర మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Sheikh Hasina India Visit: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇండియాలోొ పర్యటిస్తున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు షేక్ హసీనా. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవడానికి పలు ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధాని మోదీ, షేక్ హసీనాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. వచ్చే 25 ఏళ్లలో భారత్-బంగ్లా సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకుంటాయని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులకు భారతదేశం అతిపెద్ద మార్కెట్ అని మోదీ అన్నారు. బంగ్లాదేశ్, భారత దేశ అతిపెద్ద అభివృద్ధి, వాణిజ్య భాగస్వామి అని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోందని ఆయన అన్నారు.
Read Also: Asia Cup 2022: అలా జరిగితే ఆసియా కప్ పాకిస్థాన్దే.. సెహ్వాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
ఐటీ, అంతరిక్షం, అణురంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయని మోదీ అన్నారు. విద్యుత్ ప్రసార మార్గాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. నదీ నీటి పంపిణీకి సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఇరు దేశాల మధ్య 54 నదులు ప్రవహిస్తున్నాయని.. ఈ రోజు కుషియార నదీ నీలటి భాగస్వామ్యానికి సంబంధించి కీలక ఒప్పందం జరిగిందని.. ప్రధానులు మోదీ, షేక్ హసీనా సంయుక్తంగా ప్రకటించారు. దీంతో పాటు ఉగ్రవాదం, రోహింగ్యాల సమస్యలు, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. ఇరు దేశాల చర్చలు ప్రజలకు మేలు చేస్తాయని ప్రధాని షేక్ హసీనా అన్నారు. మొత్తం ఇరు దేశాల మధ్య 7 ఎంఓయూలు కుదిరాయి.
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అనేక సమస్యలు పరిష్కరించుకున్నామని.. తీస్తా నీటి భాగస్వామి ఒప్పందంతో పాటు ఇతర సమస్యలను త్వరలోనే ముగిస్తామని ప్రధాని షేక్ హసీనా అన్నారు. బంగ్లాదేశ్కు భారతదేశం అత్యంత ముఖ్యమైన మరియు సన్నిహిత పొరుగు దేశమని, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని ఆమె అన్నారు. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ప్రధాని షేక్ హసీనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజావార్తలు
-
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
-
Salman Khan: స్కూల్ పిల్లల కోసం..సల్మాన్ రూ.15 కోట్ల విరాళం..
-
Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
-
Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బలహీనత బయటపడిందా?.. రాజస్థాన్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..