Himanta Biswa Sarma: 800 ప్రభుత్వ మదర్సాల రద్దు.. టెర్రరిస్టులకు అడ్డాగా అస్సాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma Comments On Terrorism in Assam: ఇస్లామిక్ ఛాందసవాదుకులు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా మారుతున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదు నెల్లలో అస్సాంలో 5 టెర్రర్ మాడ్యూల్స్ పట్టుబడటం ఆందోళనకు తావిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల అస్సాంలో పలు ప్రాంతాల్లో అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ముస్తఫాను భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ముస్తఫా మోరిగావ్ ప్రాంతంలో మదర్సా నిర్వహిస్తూ.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఈ రోజు అధికారులు మదర్సాను కూల్చేశారు. యూఏపీఏ చట్టం కింద మదర్సాలను కూల్చివేసినట్లు బిశ్వశర్మ వెల్లడించారు.
ఈ ఏడాది ఐదు నెలల కాలంలో ఐదు టెర్రర్ మాడ్యూల్స్ బయటపడినట్లు సీఎం బిశ్వశర్మ వెల్లడించారు. మార్చి నెలలో బార్ పేటలో అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బయట నుంచి వచ్చే ఇమామ్ లను ఆదరించ వద్దని సీఎం ప్రజలను కోరారు. ప్రజలకు ఆయన గురించి తెలియకుంటే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సీఎం ప్రజలకు తెలిపారు. అస్సాంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిడిచే 800 ప్రభుత్వ మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చినట్లు బిశ్వశర్మ తెలిపారు. అయితే ఇంకా రాష్ట్రంలో ఎన్నో ఖవామీ మదర్సాలు ఉ న్నాయని.. ప్రజలు, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతున్నారో గమనించాలని.. ఈ మదర్సాలపై నిఘా ఉంచాలని అన్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also: WhatsApp : 22 లక్షల భారతీయుల అకౌంట్లు బ్లాక్..
గత 5 నెలల కాలంగా అస్సాంలో ఐదు టెర్రర్ మాడ్యుళ్లను పోలీసులు ఛేదించారు. మార్చి 4న బార్ పేటలో అన్సరుల్లా బంగ్లా టీంతో సంబంధాలు ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్రిల్ 14న బార్ పేటలోనే రెండో టెర్రర్ మాడ్యుల్ ను గుర్తించి మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. జోగి ఘేపాలో మూడవ టెర్రర్ మాడ్యూల్ ను పోలీసులు గుర్తించారు. ఇదే విధంగా సమీపంలోని త్రిపుర నుంచి నలుగురిని అరెస్ట్ చేశారు. అన్సరుల్లా బంగ్లాకు చెందిన నాల్గవ మాడ్యూల్ ను మోరిగావ్ లో అదుపులోకి తీసుకుంది భద్రతా బలగాలు. జూలై 27ర బార్ పేటలో ఐదవ మాడ్యుల్ చేధించి 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!