Himanta Biswa Sarma: 800 ప్రభుత్వ మదర్సాల రద్దు.. టెర్రరిస్టులకు అడ్డాగా అస్సాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma Comments On Terrorism in Assam: ఇస్లామిక్ ఛాందసవాదుకులు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా మారుతున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదు నెల్లలో అస్సాంలో 5 టెర్రర్ మాడ్యూల్స్ పట్టుబడటం ఆందోళనకు తావిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల అస్సాంలో పలు ప్రాంతాల్లో అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ముస్తఫాను భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ముస్తఫా మోరిగావ్ ప్రాంతంలో మదర్సా నిర్వహిస్తూ.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఈ రోజు అధికారులు మదర్సాను కూల్చేశారు. యూఏపీఏ చట్టం కింద మదర్సాలను కూల్చివేసినట్లు బిశ్వశర్మ వెల్లడించారు.
ఈ ఏడాది ఐదు నెలల కాలంలో ఐదు టెర్రర్ మాడ్యూల్స్ బయటపడినట్లు సీఎం బిశ్వశర్మ వెల్లడించారు. మార్చి నెలలో బార్ పేటలో అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బయట నుంచి వచ్చే ఇమామ్ లను ఆదరించ వద్దని సీఎం ప్రజలను కోరారు. ప్రజలకు ఆయన గురించి తెలియకుంటే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సీఎం ప్రజలకు తెలిపారు. అస్సాంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిడిచే 800 ప్రభుత్వ మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చినట్లు బిశ్వశర్మ తెలిపారు. అయితే ఇంకా రాష్ట్రంలో ఎన్నో ఖవామీ మదర్సాలు ఉ న్నాయని.. ప్రజలు, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతున్నారో గమనించాలని.. ఈ మదర్సాలపై నిఘా ఉంచాలని అన్నారు.
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
Read Also: WhatsApp : 22 లక్షల భారతీయుల అకౌంట్లు బ్లాక్..
గత 5 నెలల కాలంగా అస్సాంలో ఐదు టెర్రర్ మాడ్యుళ్లను పోలీసులు ఛేదించారు. మార్చి 4న బార్ పేటలో అన్సరుల్లా బంగ్లా టీంతో సంబంధాలు ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్రిల్ 14న బార్ పేటలోనే రెండో టెర్రర్ మాడ్యుల్ ను గుర్తించి మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. జోగి ఘేపాలో మూడవ టెర్రర్ మాడ్యూల్ ను పోలీసులు గుర్తించారు. ఇదే విధంగా సమీపంలోని త్రిపుర నుంచి నలుగురిని అరెస్ట్ చేశారు. అన్సరుల్లా బంగ్లాకు చెందిన నాల్గవ మాడ్యూల్ ను మోరిగావ్ లో అదుపులోకి తీసుకుంది భద్రతా బలగాలు. జూలై 27ర బార్ పేటలో ఐదవ మాడ్యుల్ చేధించి 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..