Himanta Biswa Sarma: 800 ప్రభుత్వ మదర్సాల రద్దు.. టెర్రరిస్టులకు అడ్డాగా అస్సాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma Comments On Terrorism in Assam: ఇస్లామిక్ ఛాందసవాదుకులు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా మారుతున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదు నెల్లలో అస్సాంలో 5 టెర్రర్ మాడ్యూల్స్ పట్టుబడటం ఆందోళనకు తావిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల అస్సాంలో పలు ప్రాంతాల్లో అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ముస్తఫాను భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ముస్తఫా మోరిగావ్ ప్రాంతంలో మదర్సా నిర్వహిస్తూ.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఈ రోజు అధికారులు మదర్సాను కూల్చేశారు. యూఏపీఏ చట్టం కింద మదర్సాలను కూల్చివేసినట్లు బిశ్వశర్మ వెల్లడించారు.
ఈ ఏడాది ఐదు నెలల కాలంలో ఐదు టెర్రర్ మాడ్యూల్స్ బయటపడినట్లు సీఎం బిశ్వశర్మ వెల్లడించారు. మార్చి నెలలో బార్ పేటలో అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బయట నుంచి వచ్చే ఇమామ్ లను ఆదరించ వద్దని సీఎం ప్రజలను కోరారు. ప్రజలకు ఆయన గురించి తెలియకుంటే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సీఎం ప్రజలకు తెలిపారు. అస్సాంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిడిచే 800 ప్రభుత్వ మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చినట్లు బిశ్వశర్మ తెలిపారు. అయితే ఇంకా రాష్ట్రంలో ఎన్నో ఖవామీ మదర్సాలు ఉ న్నాయని.. ప్రజలు, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతున్నారో గమనించాలని.. ఈ మదర్సాలపై నిఘా ఉంచాలని అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: WhatsApp : 22 లక్షల భారతీయుల అకౌంట్లు బ్లాక్..
గత 5 నెలల కాలంగా అస్సాంలో ఐదు టెర్రర్ మాడ్యుళ్లను పోలీసులు ఛేదించారు. మార్చి 4న బార్ పేటలో అన్సరుల్లా బంగ్లా టీంతో సంబంధాలు ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎప్రిల్ 14న బార్ పేటలోనే రెండో టెర్రర్ మాడ్యుల్ ను గుర్తించి మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. జోగి ఘేపాలో మూడవ టెర్రర్ మాడ్యూల్ ను పోలీసులు గుర్తించారు. ఇదే విధంగా సమీపంలోని త్రిపుర నుంచి నలుగురిని అరెస్ట్ చేశారు. అన్సరుల్లా బంగ్లాకు చెందిన నాల్గవ మాడ్యూల్ ను మోరిగావ్ లో అదుపులోకి తీసుకుంది భద్రతా బలగాలు. జూలై 27ర బార్ పేటలో ఐదవ మాడ్యుల్ చేధించి 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!