Bangladesh: ఎన్నికల్లో అవామీలీగ్ అరాచకాలక పాల్పడిందని బంగ్లాదేశ్ విద్యార్థి నేతలు ఆరోపించి, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చేలా చేశారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ను తాత్కాలిక దేశాధినేతగా చేశారు. ఈయన హయాంలో నిర్వహించిన ఎన్నికల్లో ఇటీవల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది.
Tarique Rahman: బంగ్లాదేశ్లో 18 నెలల పాటు కొనసాగిన అనిశ్చితి తొలిగిపోయింది. ఎట్టకేలకు ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం కొలువుదీరనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి జమాతే ఇస్లామీతో పోలిస్తే పెద్ద సంఖ్యలో సీట్లను గెలుచుకుంది.
Sheikh Hasina: హంతకుడు, ఫాసిస్ట్ మహ్మద్ యూనస్ నిర్వహించి బంగ్లాదేశ్ బూటకపు ఎన్నికల్ని రద్దు చేయాలని మాజీ ప్రధాని షేక్ హసీనా డిమాండ్ చేశారు. యూనస్ వెంటనే రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన 18 నెలల తర్వాత బంగ్లాలో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 12న జరిగాయి.
Sheikh Hasina: గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. అయితే, అప్పటి నుంచి హసీనా భారత్లో ప్రవాసంలో ఉంటున్నారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించిన తర్వాత, లక్షలాది మంది పార్టీ మద్దతుదారులు వచ్చే ఏడాది జరుగనున్న జాతీయ ఎన్నికల్ని బహిష్కరిస్తారని షేక్ హసీనా రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ప్రస్తుతం, ఢిల్లీలో స్వేచ్ఛగా నివసిస్తున్నానని, అవకాశం…
అవామీ లీగ్ నాయకుడు మహ్మద్ షహబుద్దీన్ చుప్పు బంగ్లాదేశ్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మెజారిటీ ఉన్న ఆయనను అధికార పార్టీ నామినేట్ చేయడంతో.. ఈ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వారు ఎవరూ లేకపోవడంతో, చుప్పు అప్రమేయంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.