Sheikh Hasina: ఢిల్లీలో స్వేచ్ఛగా ఉన్నా, బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నాకానీ..
- బంగ్లాదేశ్ వెళ్లాలని అనుకుంటున్నా..
- కానీ స్థిరమైన, రాజ్యాంగబద్ధ ప్రభుత్వం ఉంటేనే వెళ్తా..
- ఢిల్లీలో స్వేచ్ఛగా ఉన్నా..
- మనసులో మాట బయటపెట్టిన షేక్ హసీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. అయితే, అప్పటి నుంచి హసీనా భారత్లో ప్రవాసంలో ఉంటున్నారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించిన తర్వాత, లక్షలాది మంది పార్టీ మద్దతుదారులు వచ్చే ఏడాది జరుగనున్న జాతీయ ఎన్నికల్ని బహిష్కరిస్తారని షేక్ హసీనా రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ప్రస్తుతం, ఢిల్లీలో స్వేచ్ఛగా నివసిస్తున్నానని, అవకాశం వస్తే నా దేశానికి తిరిగి వెళ్లాలని ఉందని చెప్పారు. అయితే, అవామీ లీగ్ కాకుండా ఏ ప్రభుత్వం ఏర్పడిన తాను తిరిగి వెళ్లనని ఆమె స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో చట్టబద్ధమైన ప్రభుత్వం, రాజ్యాంగ పాలన, శాంతి, స్థిరత్వం ఉన్నప్పడు మాత్రమే తాను బంగ్లా వెళ్తానని చెప్పారు.
Read Also: Cyclone Montha: తుఫాన్ అనంతర చర్యలు అత్యంత కీలకం.. యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి..
Also Read
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
- Tamil Nadu Political Crisis: దళపతి దెబ్బకు ఏకం అవుతున్న బద్ద శత్రువులు? విజయ్ పొలిటికల్ పవర్కు స్టాలిన్, పళనిస్వామి చెక్!
ప్రస్తుతం, బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా మహ్మద్ యూనస్ కొనసాగుతున్నాడు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అవామీలీగ్ పై నిషేధం అన్యాయమని, దేశానికి ప్రతికూలం అని, కొట్లాది మంది ప్రజల మద్దతు ఉన్న పార్టీని ఎన్నికల నుంచి తప్పించడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆమె అన్నారు. ఈ ఏడాది మేలో బంగ్లా ఎన్నికల సంఘం అవామీ లీగ్ రిజస్ట్రేషన్ ను సస్పెండ్ చేసింది. ప్రభుత్వం పార్టీ కార్యకలాపాలను నిలిపేసింది.
అవామీలీగ్ భవిష్యత్తులో రాజకీయ పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వం లేదా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని, పార్టీ తన కుటుంబం ఆధారంగా కాకుండా దేశం ఆధారంగా ఉండాలని అన్నారు. ఆమె కుమారుడు సజీబ్ వాజెడ్ అమెరికాలో ఉంటూ పార్టీకి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అవసరం అయితే తానే పార్టీని నడిపేందుకు సిద్ధమని గత ఏడాది చెప్పారు. హసీనా తండ్రి , ముగ్గురు సోదరులను 1975 సైనిక తిరుగుబాటులో హత్య చేశారు. అందుకే తాను ఇప్పటి వరకు భద్రతపై జాగ్రత్తగా ఉంటున్నానని చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
-
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
-
Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!