Bangladesh: బంగ్లా విద్యార్థి నేతలు ఇక మారరా.. బీఎన్పీ విజయానికి భారత్ కారణమట..
- ఎన్నికల్లో ఓడినా బంగ్లాదేశ్ విద్యార్థి నేతలకు బుద్ధిరావడం లేదు..
- బీఎన్పీ భారత్తో చేయి కలిపి విజయం సాధించిందని ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ఎన్నికల్లో అవామీలీగ్ అరాచకాలక పాల్పడిందని బంగ్లాదేశ్ విద్యార్థి నేతలు ఆరోపించి, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చేలా చేశారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ను తాత్కాలిక దేశాధినేతగా చేశారు. ఈయన హయాంలో నిర్వహించిన ఎన్నికల్లో ఇటీవల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు బంగ్లాదేశ్ విద్యార్థి నేతల ఏడుపు బీఎన్పీపై పడింది.
Read Also: Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్కు ఇది కీలక పరీక్ష!
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
షేక్ హసీనాను గద్దె దించడంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి నేత నాహిద్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) కన్వీనర్, ప్రతిపక్ష పార్టీ విప్ అయిన నాహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీఎన్పీ భారత్తో చేయి కలిపిందని ఆరోపించారు. 2026 ఎన్నికల్లో భారత్, అవామీలీగ్తో సంధి చేసుకుని బీఎన్పీ విజయం సాధించిందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు సందేహాస్పదంగా ఉన్నాయని, స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మళ్లీ అవామీలీగ్ను బలపరిచే ప్రయత్నం చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని అన్నారు. దేశ ప్రజలు ఎలాంటి రాజకీయ పునర్వాసం ప్రయత్నాలను అంగీకరించడని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే దీనిని అడ్డుకుంటామని హెచ్చరించారు. అవామీ లీగ్పై చర్చలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే దీనికి పూర్తి బాధ్యత కొత్త ప్రభుత్వానిదే అని అన్నారు. అవామీ లీగ్ను మళ్లీ బతికించేందుకు ప్రయత్నిస్తే రాజకీయ పోరాటానికి సిద్ధమని చెప్పారు. దేశంలో మళ్లీ అవామీ లీగ్ ఆఫీసుల్ని తెరుస్తున్నారని, ఇది రాజకీయ వ్యూహం కావచ్చని నాహిద్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు”.. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
-
Senior Hero : సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న హీరో
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Tamil Cinema : హిట్ కొట్టు.. కార్లు పట్టు.. కోలీవుడ్ కొత్త కల్చర్
-
Pawan Kalyan: ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!