Bangladesh: బంగ్లా విద్యార్థి నేతలు ఇక మారరా.. బీఎన్పీ విజయానికి భారత్ కారణమట..
- ఎన్నికల్లో ఓడినా బంగ్లాదేశ్ విద్యార్థి నేతలకు బుద్ధిరావడం లేదు..
- బీఎన్పీ భారత్తో చేయి కలిపి విజయం సాధించిందని ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ఎన్నికల్లో అవామీలీగ్ అరాచకాలక పాల్పడిందని బంగ్లాదేశ్ విద్యార్థి నేతలు ఆరోపించి, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చేలా చేశారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ను తాత్కాలిక దేశాధినేతగా చేశారు. ఈయన హయాంలో నిర్వహించిన ఎన్నికల్లో ఇటీవల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు బంగ్లాదేశ్ విద్యార్థి నేతల ఏడుపు బీఎన్పీపై పడింది.
Read Also: Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్కు ఇది కీలక పరీక్ష!
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
షేక్ హసీనాను గద్దె దించడంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి నేత నాహిద్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) కన్వీనర్, ప్రతిపక్ష పార్టీ విప్ అయిన నాహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీఎన్పీ భారత్తో చేయి కలిపిందని ఆరోపించారు. 2026 ఎన్నికల్లో భారత్, అవామీలీగ్తో సంధి చేసుకుని బీఎన్పీ విజయం సాధించిందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు సందేహాస్పదంగా ఉన్నాయని, స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మళ్లీ అవామీలీగ్ను బలపరిచే ప్రయత్నం చేస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని అన్నారు. దేశ ప్రజలు ఎలాంటి రాజకీయ పునర్వాసం ప్రయత్నాలను అంగీకరించడని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే దీనిని అడ్డుకుంటామని హెచ్చరించారు. అవామీ లీగ్పై చర్చలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే దీనికి పూర్తి బాధ్యత కొత్త ప్రభుత్వానిదే అని అన్నారు. అవామీ లీగ్ను మళ్లీ బతికించేందుకు ప్రయత్నిస్తే రాజకీయ పోరాటానికి సిద్ధమని చెప్పారు. దేశంలో మళ్లీ అవామీ లీగ్ ఆఫీసుల్ని తెరుస్తున్నారని, ఇది రాజకీయ వ్యూహం కావచ్చని నాహిద్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!