Kishan Reddy : 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ అభివృద్ధికి మంచి రోడ్లు కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక తెలంగాణలో 2 వేల 482 కిలోమీటర్ల నిర్మాణం జరిగిందని, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ లో 2 వేల 500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవని ఆయన వెల్లడించారు. 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయని ఆయన అన్నారు. ఒక్క పెద్దపల్లి జిల్లా కేంద్రం తప్ప మిగతా అన్ని జిల్లా కేంద్రాలకు జాతీయ రహదారులు అను సంధానం అయ్యాయని, మోడీ ప్రధాని అయ్యాక తెలంగాణలో 75 రోడ్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
31 వేల 664 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని, 13 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ పాటు మంజూరు అయిన పనులు 32 వేల 775 కోట్లని, సీఆర్ఐఎఫ్ కింద 3,314 కోట్లు మంజూరయ్యాయని ఆయన స్పష్టం చేశారు. 850 కోట్లతో రోడ్ల మరమ్మతులు, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కాకుండా జాతీయ రహదారులకు కేంద్రం 93 వేల 650 కోట్లు తెలంగాణకి కేటాయించిందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
తాజావార్తలు
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
-
Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్కు అపాయింట్మెంట్
-
BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం..
-
Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
-
Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు