ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజ్కోట్ వేదికగా భారత జట్టుతో ఇవాళ ( బుధవారం ) జరుగుతున్న మూడో వన్డేలో 5000 రన్స్ మార్కును అందుకున్నాడు. తద్వారా ఆసీస్ తరఫున వన్డేల్లో ఈ మార్కును చేసిన 17వ క్రికెటర్గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు.
Australia: రెండో ప్రపంచ యుద్దం తరువాత చైనా అతిపెద్ద సాంప్రదాయిక సైనిక సమీకరణను ఏర్పాటు చేస్తోందని ఆస్ట్రేలియన్ రాయబారి మంగళవారం అన్నారు. అయితే ఈ సైనికీకరణ వ్యూహాత్మక ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయడకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లిష్టకాలంలో చైనాతో ఆస్ట్రేలియా సంబంధాన్ని స్థిరీకరించకోవడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
భారత జట్టుతో రేపు ( బుధవారం ) జరుగబోయే నామమాత్రపు మూడో వన్డేలో ఇద్దరు ఆస్ట్రేలియా స్టార్లు ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయాల కారణంగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ స్టార్క్ మూడో వన్డేలో బరిలో దిగుతున్నట్లు తెలుస్తుంది.
ఆస్ట్రేలియాతో రెండో వన్డే మ్యాచ్ తర్వాత గిల్, అయ్యర్ ఓ ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడారు. ఆ వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది. అందులో గిల్, శ్రేయాస్ అయ్యర్ ఒకరి గురించి ఒకరు సమాధానాలు చెప్పుకుంటారు.
Suryakumar Yadav 4 Sixes Video Goes Viral: ‘సూర్యకుమార్ యాదవ్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ.. ‘మిస్టర్ 360’గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న సూర్య.. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. పొట్టి ఫార్మట్లో దూకుడును వన్డేల్లో కూడా కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్ 2023కి ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న…
Cameron Green holds the Worst Record in ODI’s: ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11×4, 3×6), శుభ్మన్ గిల్ (104; 97 బంతుల్లో 6×4, 4×6), సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్; 37 బంతుల్లో 6×4, 6×6)ల దాటికి ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేశారు. భారత…
ఇండోర్ లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ 99 పరుగుల తేడాతో గెలిచింది. 217 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దీంతో 99 పరుగుల తేడాతో ఇండియా గెలుపొందింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 3 వికెట్లు, అశ్విన్ కు 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. షమీ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ గెలిచి భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.
ఇండోర్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా బ్యాట్స్మెన్లు సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత సెంచరీలు చేశారు. గిల్ 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. శ్రేయస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే వీరిద్దరి సెంచరీలతో ప్రపంచకప్పై మరింత ఉత్సాహాన్ని పెంచారు.
వన్డేలలో భారత్ అత్యధిక స్కోర్లు నమోదుచేసింది. ఇంతకుముందు టీమిండియా.. 2011లో వెస్టిండీస్ పై 418 పరుగులు చేసింది. 2009లో శ్రీలంకపై 414 పరుగులు, 2007లో బెరుమాడపై 413, 2002లో బంగ్లాదేశ్ పై 409, 2014లో శ్రీలంకపై 404, 2010లో సౌతాఫ్రికాపై 401 పరుగులు చేసింది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో మళ్లీ అత్యధిక పరుగుల దిశగా భారత్ దూసుకెళ్తుంది.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు.. ప్రధాన మార్పులతో రెండో వన్డే ఆడనుంది. రేపు (ఆదివారం) ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.