అస్సాంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం తెల్లవారుజామున (2.25 గంటలకు) అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) పేర్కొంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. దాంతో జనాలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అస్సాం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయని ఎన్సీఎస్ తెలిపింది. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్, భూటాన్, చైనాతో సహా…
అస్సాంలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్పై దుండగులు దాడికి తెగబడ్డారు. పార్టీ కార్యక్రమానికి స్కూటర్పై వెళ్తుండగా ముసుగులు ధరించిన ఆగంతకులు బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు.
Assam Congress: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోక్సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ను నియమించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకుల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు కూడా తెలియజేశారు.
అస్సాంలో 10 నెలల చిన్నారిలో 'హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్' (HMPV) ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. అస్సాంలో ఇది మొదటి కేసు. ఈ మేరకు శనివారం అధికారులు సమాచారం అందించారు. దిబ్రూఘర్లోని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చిన్నారికి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
స్సాం రాష్ట్రంలోని దిమా హసావ్ జిల్లాకు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో సోమవారం నాడు తవ్వకాలు కొనసాగిస్తుండగా అకస్మాత్తుగా 100 అడుగుల మేర నీళ్లు ప్రవేశించాయి. దాంతో తొమ్మిది మంది కార్మికులు అందులో చిక్కుకొన్నారు. అయితే, వారిలో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు.
Assam: అస్సాంలోని డిమా హసావో జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 300 అడుగుల లోతున్న క్వారీలోకి నీరు రావడంతో కార్మికులు ‘‘ర్యాట్ హోల్’’ బొగ్గు గనిలో చిక్కుకుపోయారు.
Bangladesh: భారత వ్యతిరేకి, ఉగ్రసంస్థ ‘‘ఉల్ఫా’’ చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షను బంగ్లాదేశ్ కోర్టు రద్దు చేసింది. 2004 ఛటోగ్రామ్ ఆయుధ రవాణా కేసులో బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్ఫోజామన్ బాబర్తో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్ర సంస్థ చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షని జీవితఖైదుకు తగ్గించినట్లు బంగ్లా మీడియా తెలియజేసింది.
లొంగిపోయిన మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బస్తర్లో లొంగిపోయిన మావోయిస్టులకు 15,000 ఇళ్లు కట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వైపులా శత్రువులు చుట్టుముట్టినప్పటికీ జ్ఞానం, సైన్స్ ఉపయోగించి ఇజ్రాయెల్ ఎలా బలమైన దేశంగా మారింది.. దాని చరిత్ర గురించి మనం నేర్చుకోవాలని తెలిపారు.
Bangladesh: బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ దుస్సాహసానికి పాల్పడ్డారు. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి, ఇక్కడి ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(BGB) అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించారు. అస్సాంలో బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో హిందూ ఆలయ పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆలయం బంగ్లాదేశ్లో ముస్లింలను కించపరుస్తుందని, అక్కడ హింస చెలరేగుతుందని చెప్పారు.