Assam: ముంచెత్తిన వరద.. “ర్యాట్ హోల్” బొగ్గు గనిలో చిక్కుకున్న 18 మంది కార్మికులు..
- అస్సాంలో ర్యాట్-హోల్ బొగ్గు గనిలో ప్రమాదం..
- గనిలోకి నీరు చేరడంతో చిక్కుకుపోయిన 18 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాంలోని డిమా హసావో జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 300 అడుగుల లోతున్న క్వారీలోకి నీరు రావడంతో కార్మికులు ‘‘ర్యాట్ హోల్’’ బొగ్గు గనిలో చిక్కుకుపోయారు. అక్రమ గని మేఘాలయ సరిహద్దుల్లో ఉన్న మారుమూల పారిశ్రామిక పట్టణమైన ఉమ్రాంగ్సోలో ఉంది. గనిలో దాదాపుగా 100 అడుగుల మేర నీరు చేరిందని, సహాయక చర్యలకు తీవ్రమైన అంతరాయం కలుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు మోటార్ల సాయంతో నీటిని బయటకు తీస్తున్నారు.
Read Also: Andhra Pradesh: 2 రోజుల్లో భవన నిర్మాణాలకు కొత్త రూల్స్.. రియల్ ఎస్టేట్ పెరిగేలా నిబంధనలు..
Also Read
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- Suryastra Rocket: శత్రువులకు హెచ్చరికగా.. స్వదేశీ ‘సూర్యాస్త్ర’ రాకెట్ సక్సెస్.. పెరిగిన డిఫెన్స్ పవర్
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ కొనసాగుతున్న రెస్క్యూ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్మీ నుంచి సాయం కోరింది. “కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో మేము ఆర్మీ సహాయాన్ని అభ్యర్థించాము. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) కూడా ప్రయత్నాలలో సహాయం చేయడానికి సంఘటన స్థలానికి చేరుకుంటున్నాయి” అని చెప్పారు.
ర్యాల్ హోల్ మైనింగ్ అనేది ప్రమాదకరమైన పద్ధతి. కార్మికులు ఇరుకైన సొరంగాల్లో మాన్యువల్గా తవ్వుతుంటారు. ఈ సొరంగాలు లోతైన గుంటలకు దారి తీస్తాయి. వీటి నుంచి బొగ్గు తవ్వి తీస్తుంటారు. 2018లో, మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ బొగ్గు గనిలో సమీపంలోని నది నుండి నీరు రావడంతో 15 మంది మైనర్లు అందులో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో కేవలం 2 మృతదేహాలను మాత్రమే లభ్యమైనట్లు రెస్క్యూ సిబ్బంది చెప్పింది. 2019లో, మేఘాలయ రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకాన్ని అరికట్టడంలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ. 100 కోట్ల జరిమానా విధించింది. రాష్ట్రంలోని 24,000 గనుల్లో చాలా వరకు అక్రమ గనులు ఉన్నాయని ఎన్జీటీ తేల్చింది.
తాజావార్తలు
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
-
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
-
Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!