రాచకొండ కమిషనరేట్ పరిధిలో 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఫెడ్లర్లను అరెస్టు చేశారు. ఒడిస్సా నుండి హర్యానాకు గంజాయిని తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. గంజాయి రవాణాకు ట్రాన్స్పోర్ట్ ఆటలో సీక్రెట్ పార్టీషన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. ఒడిస్సా నుండి హైదరాబాద్ మీదుగా హర్యానాకు తీసుకెళ్తున్న ఇద్దరు పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి వద్ద వాహనం తనిఖీల్లో కోటి ఇరువై ఎనిమిది లక్షల విలువైన 510 కిలోల గంజాయిని…
చండీగఢ్లోని అమృత్సర్లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలోని 'మోస్ట్ వాంటెడ్' నేరస్థులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్వాలే మేనల్లుడు రోడ్.. కాగా లఖ్బీర్ సింగ్ పాకిస్తాన్లో గుండెపోటుతో మరణించాడు. అతని సహచరుడు పరమజీత్ సింగ్ అలియాస్ ధాదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ముంబైలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ టీచర్. ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సియోన్ కోలివాడ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్లో 16 ఏళ్ల విద్యార్థిని కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో.. బాధితురాలి కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 మి.లీ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నామని అన్నారు. సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని పేర్కొన్నారు.
కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ ఆదివారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని తన నివాసంలో దారుణంగా కత్తిపోట్లకు గురై, చనిపోయారు. అయితే ఈ హత్య కేసులో పోలీసులు కిరణ్ అనే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు కొంతకాలంగా.. కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే అతన్ని కొన్ని రోజుల కిందట ప్రతిమ సర్వీసు నుంచి తొలగించింది.
భుత్వ పదవులు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు విశ్వతేజగా పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ బంగారపు షాపు యజమాని దగ్గర, రాజ్యసభ సీటు ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Iam With CBN Placards Display in India vs Pakistan Match: స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ‘బాబుతో నేను’ అంటూ వేలాది మంది బెంగళూరు ప్రజలు మాజీ సీఎం చంద్రబాబుకు అండగా…
IND-PAK : అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు ఇరు దేశాల క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది.
మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీగా గుర్తించారు. ఈ ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో అంగన్వాడి, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, దొడ్ల, గ్రామ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.