Drugs Seize: హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 మి.లీ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నామని అన్నారు. సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుండి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకునట్లు పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: ఆ రెండు భావజాలాలు నాకు ఇష్టం.. ఒక తాటిపైకి తేవాలన్నదే నా ఉద్దేశం
Also Read
- Vijay Cabinet: విజయ్ కేబినెట్ లిస్ట్ రెడీ.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
- Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..
పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు 50 లక్షల రూపాయల విలువ ఉంటుందని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ తయారీలో ప్రధాన నిందితుడు కమ్మ శ్రీనివాస్ గా గుర్తించామని.. అతను ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గాజుల రామారంలో ఉంటాడని పేర్కొన్నారు. మణికంఠ స్వస్థలం.. కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అతనికి చేపల చెరువులు ఉన్నట్లు తెలిపారు. కమ్మ శ్రీనివాస్ 2013లో ఓ పరిశ్రమలో ఇదే డ్రగ్స్ తయారీ చేసాడని.. ఆ సమయంలో NCB వాళ్ళు పట్టుకుని జైలుకు పంపారు.. నాలుగు సంవత్సరాలు తర్వాత బయటికి వచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. జైలు నుండి బయటికి వచ్చాక నరసింహ రాజు మణికంఠతో కలిపి డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టాడని తెలిపారు.
Read Also: Game changer : శంకర్ కు డెడ్ లైన్ పెట్టిన రాంచరణ్..?
సూరారంలో ఒక ఇంట్లో మెథాంఫెటమైన్ డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారని ఎస్పీ గుమ్మి చక్రవర్తి చెప్పారు. నిందితుడు కమ్మ శ్రీనివాస్కు డ్రగ్స్ తయారీపై అవగాహన ఉంది… ఈ ముగ్గురు సంయుక్తంగా గత రెండు సంవత్సరాలుగా డ్రగ్స్ తయారుచేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. లిక్విడ్ మెథాంఫెటమైన్ ప్రాసెస్ చేసి డ్రై చేస్తే క్రిస్టల్ మెథాంఫెటమైన్ డ్రగ్ తయారవుతుంది. తయారుచేసిన డ్రగ్స్ వివిధ ప్రాంతాల్లో విక్రయించారు… సోషల్ మీడియా ద్వారా విక్రయాలు కొనసాగించారని న్యాబ్ ఎస్పీ తెలిపారు. మెథాంఫెటమైన్ డ్రగ్ అనేది రిలాక్స్ మూడ్ లోకి తీసుకెళ్తుందని వినియోగిస్తారు ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితుల పై పీడియాక్ట్ ప్రపోజ్ చేస్తామని టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు.
తాజావార్తలు
-
Ashu Reddy: షాకింగ్.. చీటింగ్ కేసు నడుస్తుండగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న అషు రెడ్డి
-
Vijay Cabinet: విజయ్ కేబినెట్ లిస్ట్ రెడీ.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..!
-
Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
-
Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్లో మాయమైన వైరస్ శాంపిల్స్!