Drugs Seize: హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా అరెస్ట్.. నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను టీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 మి.లీ లిక్విడ్ మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి ప్రెస్ మీట్ నిర్వహించారు. సూరారంలో డ్రగ్స్ తయారీ ముఠాను పట్టుకున్నామని అన్నారు. సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుండి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకునట్లు పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: ఆ రెండు భావజాలాలు నాకు ఇష్టం.. ఒక తాటిపైకి తేవాలన్నదే నా ఉద్దేశం
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు 50 లక్షల రూపాయల విలువ ఉంటుందని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ తయారీలో ప్రధాన నిందితుడు కమ్మ శ్రీనివాస్ గా గుర్తించామని.. అతను ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గాజుల రామారంలో ఉంటాడని పేర్కొన్నారు. మణికంఠ స్వస్థలం.. కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అతనికి చేపల చెరువులు ఉన్నట్లు తెలిపారు. కమ్మ శ్రీనివాస్ 2013లో ఓ పరిశ్రమలో ఇదే డ్రగ్స్ తయారీ చేసాడని.. ఆ సమయంలో NCB వాళ్ళు పట్టుకుని జైలుకు పంపారు.. నాలుగు సంవత్సరాలు తర్వాత బయటికి వచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. జైలు నుండి బయటికి వచ్చాక నరసింహ రాజు మణికంఠతో కలిపి డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టాడని తెలిపారు.
Read Also: Game changer : శంకర్ కు డెడ్ లైన్ పెట్టిన రాంచరణ్..?
సూరారంలో ఒక ఇంట్లో మెథాంఫెటమైన్ డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారని ఎస్పీ గుమ్మి చక్రవర్తి చెప్పారు. నిందితుడు కమ్మ శ్రీనివాస్కు డ్రగ్స్ తయారీపై అవగాహన ఉంది… ఈ ముగ్గురు సంయుక్తంగా గత రెండు సంవత్సరాలుగా డ్రగ్స్ తయారుచేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. లిక్విడ్ మెథాంఫెటమైన్ ప్రాసెస్ చేసి డ్రై చేస్తే క్రిస్టల్ మెథాంఫెటమైన్ డ్రగ్ తయారవుతుంది. తయారుచేసిన డ్రగ్స్ వివిధ ప్రాంతాల్లో విక్రయించారు… సోషల్ మీడియా ద్వారా విక్రయాలు కొనసాగించారని న్యాబ్ ఎస్పీ తెలిపారు. మెథాంఫెటమైన్ డ్రగ్ అనేది రిలాక్స్ మూడ్ లోకి తీసుకెళ్తుందని వినియోగిస్తారు ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితుల పై పీడియాక్ట్ ప్రపోజ్ చేస్తామని టీఎస్ న్యాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!