Lover Suicide: హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో గల జిల్లెల్లగూడలోని డీఎన్ఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేసిందని మదన్ యాదవ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ సూద్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. నిన్న శ్రీశైలం వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు ప్రవీణ్ సూద్. జూబ్లీహిల్స్ లోని సిబిఐ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సీబీఐ గెస్ట్ హౌస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
AR Rahman: ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ రోజు ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మిక అనారోగ్య సమస్య కారణంగా ఆయన అస్వస్థతకు గురవడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించి, అన్ని అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సమాచారం ప్రకారం రెహమాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆస్పత్రిలో కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత తాజాగా ఆయనను డిశ్చార్జ్ చేశారు.…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. ఈ రోజు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు పవన్ కల్యాణ్.. ఆయనకు స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు..
LK Advani: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అపోలో హస్పటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ విభాగంలో చేరిన ఆయన.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్లో ఉంచామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Kidney Scandal : బంగ్లాదేశ్, భారతదేశంలో అక్రమ కిడ్నీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ ముఠా నాలుగేళ్లలో దాదాపు 500 మందికి అక్రమంగా కిడ్నీలు అమర్చింది.
బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి అద్వానీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు, భారతరత్న ఎల్కే. అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటినా అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇటీవల కూడా ఆస్పత్రికి వచ్చారు