అక్కడ ఇచ్చే పెన్నుల కోసం ప్రతిఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వీటి కోసం పోటీ పడతారు. పరీక్షలు వచ్చాయంటే విద్యార్థుల్లో భయం ఒక ఎత్తైతే.. తల్లిదండ్రుల ఆందోళన మరోఎత్తు. అయితే కొందరు తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రం ఓ పెన్ను కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన పెన్నుతో పరీక్షలు రాస్తే విజయం సొంతమట. అదే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి పెన్నుల పండుగ. ఆ డీటెయిల్స్ ఏంటో…
దోపిడీ దొంగను పట్టుకోవడానికి పోలీసులు కోవర్టు అపరేషన్ చేపట్టారు. చెంచు యువకులను ఇన్ఫార్మర్లుగా మార్చి దొంగను పట్టుకునే యత్నం చేశారు. చెంచు యువకుల బాణాలకు దొంగ గాయపడి అడవిలోకి పరారయ్యాడు. చికిత్స కోసం అడవి నుంచి బయటికి వస్తే అరెస్టు చేయాలని పోలీసుల ప్రయత్నిస్తున్నారు. బండి ఆత్మకూరు మండలంలోని నారపరెడ్డికుంటలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల, ప్రకాశం, గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగ హనుమంతు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతడిపై 12కు పైగా దొంగతనం,…
1 నుంచి 8వ తేదీ వరకు ప్రతి నెల మొదటి 8 రోజులు మోసాలకు పాల్పడి.. ఆ తరువాత సొంత వ్యాపారాలు, జల్సాలతో గడుపుతున్న ఇద్దరు అంతః రాష్ట్ర మోసగాళ్లను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. మొదటి 8 రోజులే ఎందుకంటే.. ఆ తరువాత పెన్షనర్ల వద్ద డ్రా చేసేందుకు డబ్బులుండవన్నది వీరి ఉద్దేశం. ఈ ఇద్దరూ ఏటీఎంల వద్ద కాపు కాసి నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.…
మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భేటీ జరగనుంది. రెండు సెషన్లుగా ఈ సమావేశం జరగనుంది. మొదటి సెషన్లో ఫైళ్లు క్లియరెన్సు, వాట్సప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీపై చర్చ జరగనుంది. రెండో సెషన్లో కేంద్ర బడ్జెట్ సహా త్వరలో ప్రవేశపెట్టే ఏపీ బడ్జెట్పై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిచనున్నారు. శాఖల వారీగా ప్రగతి, మేనిఫెస్టో అమలు,…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి అమరావతికి వెళ్లనున్నారు. ఏపీలో అధికార కూటమి ప్రభుత్వంలో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైళ్ల క్లియరెన్స్లో మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అగ్రస్థానంలో ఉండగా.. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా…
Ram Gopal Varma: గత ఏడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు రాంగోపాల్ వర్మ. ఇవాళ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. కాగా ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆర్జీవీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే…
తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా 18 వైద్య కళాశాలపై యూజీసీ కొరడా ఝుళిపించింది. ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని కాలేజీలపై సీరియస్ అయింది. దీంతో దేశ వ్యాప్తంగా 18 కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలన్నాదని మాజీ మంత్రి రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించ లేదన్నారు. ఫీజులు చెల్లించ లేక విద్యార్థుల పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపించారు.
రిపబ్లిక్ డే రాష్ట్రాల శకట ప్రదర్శనలో ఏపీ శకటానికి థర్డ్ ప్లేస్ వచ్చింది.. ఏటికొప్పాక బొమ్మల కొలువు థీమ్తో ఏపీ శకటం అందరి దృష్టిని ఆకట్టుకుంది.. మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్ (మహాకుంభ్), రెండో స్థానంలో త్రిపుర (14 దేవతల ఖర్చి పూజ) నిలిచాయి. రక్షణ శాఖ ఈ మేరకు పరేడ్ శకటాల ఫలితాలను ప్రకటించింది. మరోవైపు త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందానికి బహుమతి దక్కింది. అలాగే కేంద్ర బలగాల విభాగంలో దిల్లీ పోలీసు కవాతు బృందానికి…
ఏపీ డీజీపీగా హరీష్కుమార్ గుప్తా నియామకమయ్యారు. హరీష్కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు. ఆయన 1992 బ్యాచ్కు చెందిన అధికారి. గత ఎన్నికల ముందు హరీష్కుమార్ను ఈసీ డీజీగా నియమించింది. ఈ నెల 31తో డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ముగియనుంది.