అన్ని రాష్ట్రాల మాదిరిగానే కరోనా ఎంట్రీ తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా కుప్పకూలింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందే ఏపీ అప్పుల్లో కురుకుపోయింది. టీడీపీ హయాంలో అభివృద్ధి పేరిట చేసిన అప్పులు వేలకోట్లలో ఉన్నాయి. ఈ భారం మొత్తాన్ని కూడా జగన్ సర్కారే మోయాల్సి వస్తోంది. వీటి వడ్డీల భారమే ప్రతినెలా తడిచిమోపడు అవుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఏపీ…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49, 568 శాంపిల్స్ పరీక్షించగా.. 1125 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 09 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇక ఇదే సమయంలో 1,356 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య…
ఈరోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హజరు కానున్నారు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. నేడు విచారణకు హాజరు కావాలని అచ్చెన్నాయుడుకు ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది. గత సమావేశానికి విచారణ గైర్హాజరైన కూన రవికుమార్ పై చర్యలు ఖరారు చేయనున్నారు ప్రివిలేజ్ కమిటీ. కూన రవి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది ప్రివిలేజ్ కమిటీ. కూన రవిది ధిక్కారంగా భావించి కఠిన చర్యలు తీసుకునేలా అసెంబ్లీకి…
వైఎస్ షర్మిల.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించినప్పటి నుంచి.. వరుసగా సభలు నిర్వహిస్తూ పోతున్నారు. రాజకీయంగా ఆమె చేస్తున్న విమర్శలు, తిరిగి ఆమెపై వస్తున్న ప్రతి విమర్శలు పక్కన పెడితే.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల వేస్తున్న అడుగులు.. ముచ్చటగా ఉన్నాయని.. న్యూట్రల్ పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా.. వైఎస్ జగన్ తోడబుట్టిన సోదరిగా.. ఆమె ప్రతిభ చాటుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. సాధారణంగా.. జగన్ ఏ ర్యాలీ చేసినా.. ఏ సభ నిర్వహించినా.. జన ప్రవాహం వెల్లువెత్తుతుంటుంది.…
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వానికి.. సగం కాలపరిమితి తీరింది. మరో రెండేళ్లైతే.. ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఈ లోపు ప్రజల్లో బలం పెంచుకోవాలి. బలగాన్ని కదిలించాలి. గెలుపే ధ్యేయంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి. ఇదే పనిలో ఉంది.. తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే.. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటిదైనా.. జనాల్లోకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయకత్వంలో వెళ్లి పోరాడుతోంది. ఇప్పుడు.. మిగతా వర్గాలనూ.. రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ నెల 13…
తిరుపతి వైసీపీలో రుసరుసలు..! ఎమ్మెల్యే భూమన.. మున్సిపల్ కార్పొరేటర్ల మధ్య గ్యాప్ వచ్చిందా? పాలిటిక్స్లో పెత్తనాలకు కాలం చెల్లిందని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తున్నారా? ఏ విషయంలో ఎమ్మెల్యేతో వారికి చెడింది? తిరుపతిలో భూమన వర్సెస్ వైసీపీ కార్పొరేటర్లు! గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతిలో ఆశించిన మెజారిటీ రాకపోయినా.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా పట్టుసాధించింది అధికారపార్టీ. 48 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలవగా.. టీడీపీకి ఒక్క డివిజనే దక్కింది. కార్పొరేషన్ పరిధిలో పూర్తి గ్రిప్ దక్కిందన్న…
టాలీవుడ్ కు.. ఏపీ సీఎం జగన్ షాక్ ఇచ్చి 2 రోజులు దాటుతోంది. సినిమా టికెట్లకు వెబ్ సైట్ ను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటన ఇచ్చేసింది. తమ అదుపులోకి టాలీవుడ్ ను రప్పించుకునే దిశగా ఈ అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ విధానంపై.. థియేటర్ల యజమానులు అయోమయంలో పడ్డారు. వారితో పాటు.. సినిమా టికెట్ల ఆదాయాన్ని పంచుకునే అన్ని విభాగాల ప్రతినిధులు.. టెన్షన్ పడుతున్నారు. వెబ్ సైట్ పెట్టినందుకు.. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరాల్సి ఉంటుంది.…
ఎంత బలం ఉన్నా.. ఎంతటి బలగం ఉన్నా.. ఉపాయాలు, వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఓ వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే.. ఎన్నో డక్కాముక్కీలు తినాల్సి ఉంటుంది. రాటుదేలాల్సి ఉంటుంది. అవసరమైతే ప్రజా పోరాటాల్లో అరెస్టూ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరిస్థితి ఇలాగే ఉన్నట్టు కనిపిస్తోంది. విషయం ఏదైనా సరే.. ఆయన జనాల్లోకి వెళ్తున్న తీరు చూసి.. పార్టీ అభిమానులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో.. పోలవరం నిర్వాసితులను…
తూ:గో జుల్లా పెద్దాపురం పోలీసుల నిర్వాకంతో గంజాయి కేసులో నిందితుడు పరారయ్యాడు. ఓ పాత నేరస్తుడు పెద్దాపురం మండలం తూర్పుపాకల గ్రామంలో గంజాయితో దొరికాడు. ఆ నేరస్తుడిని స్టేషన్ కు తరలిస్తుండగా ఏఎస్ఐ బైక్ పై నుంచి దూకి పారిపోయాడు. అయితే పట్టుకున్న గంజాయిని స్టేషన్ కు తరలించారు పోలీసులు. పాత నేరస్తుడు పరారు కావడంతో ఖంగుతిన్న పోలీసులు.. దొరికింది గంజాయి కాదు చెరకు పిప్పి అంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై విచారించేందుకు రంగంలోకి…
నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరి మధ్యే మాటల తూటాలు పేలాయి. సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు సాగాయి. కట్ చేస్తే.. అనుచరులు సైతం ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏ శిబిరంపై ఈగ వాలినా రెండోపక్షం అస్సలు ఊరుకోవడం లేదట. ఇదే టెక్కలి రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. టెక్కలిలో వైసీపీ వర్సెస్ టీడీపీ! శ్రీకాకుళం జిల్లాలో రాజకీయమంతా ఇప్పుడు టెక్కలి చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా.. టెక్కలి ఎమ్మెల్యేగా ఏపీ…