Home
Ap
Ap News
-
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరాం: టీడీపీ ఎంపీలు
పార్లమెంట్లో జరిగిన అఖిలపక్ష భేటీలో టీడీపీ తరపున కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పలు అంశాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు సూచించారు. ముఖ్యంగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు కోరినట్టు తెలిపారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ర్ట ప్రభుత్వం తగ్గించలేదని చెప్పామన్నారు. దీనిపై ఏకీకృత నిబంధనలు తీసుకొచ్చి దేశమంతా ఒకే ధర ఉండేలా చూడాలని కోరినట్టు వెల్లడించారు. విశాఖ ఉక్కు, ఇతర సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని… -
ఏపీకీ మరోసారి భారీ వర్ష సూచన
వర్షం మాట వింటేనే ఏపీ వణికిపోతుంది. నిన్న మొన్నటి దాకా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ తాజాగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నవాతావరణ హెచ్చరికలతో వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే… -
కౌరవ సభను మళ్ళీ గౌరవ సభగా మారుస్తాం: కాల్వ శ్రీనివాసులు
అసెంబ్లీలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గపు పని అని టీడీపీపొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీపై విమర్శలు బాణాలు వదిలిన ఆయన.. కౌరవ సభను మళ్ళీ గౌరవ సభగా మారుస్తామన్నారు. చంద్రబాబు కంటతడి జీవితంలో చూడబోమని అనుకున్నాం కానీ వైసీపీ నేతలు దిగజారి చంద్రబాబుపై విమర్శలు చేశారన్నారు. దీనికి వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో ధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట్ర… -
చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం : జగన్
విపత్తును కూడా రాజకీయ చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికై వరదల సాయంపై ఆయా అధికారులతో మాట్లాడి బాధితులకు సాయం అందేలా చూస్తున్నామన్నారు. అయినా కూడా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ‘మడమ తిప్పను మాట తప్పను అన్నారు. ఇప్పుడు మడమ తిప్పుతూ మాట తప్పుతున్నారు. గిరా గిరా తిరుగుతూ ఎక్కడో పడిపోతావ్’ అని చంద్రబాబు అంటున్నారని జగన్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జగన్ నేనే గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని… -
సాగర్, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలి: కేఆర్ఎంబీ
సాగర్, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( కేఆర్ఎంబీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు సూచించింది. ఈ మేరకు రెండు రాష్ర్టాల జనవనరుల కార్యదర్శులకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. సాగు,తాగు అవసరాలకు లేకుండా ఇష్టారీతిన విద్యుదుత్పత్తిని చేశారని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. సముద్రంలోకి 55.96 టీఎంసీలు వృథాగా పోతున్నాయని వెల్లడించింది. దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ 94.91 టీఎంసీలకు పడిపోయిందని కేఆర్ఎంబీ తెలిపింది. ఇప్పటికైనా విద్యుదుత్పత్తి ని వెంటనే నిలపి… -
అన్నపూర్ణలాంటి రాష్ట్రంలో వరి సాగు చేయొద్దంటారా.?
అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో వరి సాగు చేయొద్దంటు ఆదేశాలు ఇవ్వడం సరికాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజలు తాగితేనే సంక్షేమ పథకాలు అనే పరిస్థితి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. నేడు మద్యం తాగితేనే అమ్మఒడి అంటున్నారు. రేపు గంజాయి అమ్మిన విద్యార్థులకే రీఎంబర్స్మెంట్ అంటారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగినా పట్టించుకోకుండా.. సినిమా టికెట్లు అమ్మడం ప్రభుత్వ సిగ్గు మాలిన చర్య అని మండిపడ్డారు. 15వ ఆర్థిక… -
సీఎం లేఖ రాయగానే కేంద్రం స్పందించింది: జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్దిరోజులుగా జరిగిన వరద విపత్తు వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తీవ్రనష్టం జరిగిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రధాని, కేంద్రహోం మంత్రి దృష్టికి తీసుకు వచ్చి కేంద్ర సహాయం కోరారు. ప్రధాని స్వయంగా సీఎం జగన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిన్న సీఎం లేఖ రాయగానే కేంద్రం వెంటనే స్పందించిందని వెల్లడించారు. “ఇంటర్ మినీస్ట్రీయల్ సెంట్రల్ టీం” రేపు ఆంధ్రప్రదేశ్ లో వరద… -
బొగ్గు కొరత… ఆర్టీపీపీలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి
కడప జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ఆర్టీపీపీకి రావాల్సిన బొగ్గు సరఫరా ఆగిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గించామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీపీపీలో కేవలం 30 వేల టన్నులు మాత్రమే బొగ్గు నిల్వ ఉంది. ఆర్టీపీపీలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో మొత్తం 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 13, 6 యూనిట్లలో కలిపి 600 మెగావాట్లు… -
మండలి రద్దు నిర్ణయాన్ని వివాదాస్పదం చేయొద్దు: సుభాష్ చంద్రబోస్
శాసనమండలి రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివాదాస్పదం చేయొద్దని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విధాన నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు విషయంలో అప్పటి ఛైర్మన్ నిబంధనల ప్రకారం నడుచు కోలేదని, ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు. నిబంధనలు ఉన్నప్పటికీ అప్పటి మండలి చైర్మన్ వివాదస్పద నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బీసీల హక్కుల కోసం… -
నిండు సభలో మా తల్లిని అవమానించారు: నారాలోకేష్
మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాడే పల్లిలోని మహానాడు ప్రాంతం లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. శాసనసభలో మా తల్లిని అవమానించారు. దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించు కున్నారని లోకేష్ అన్నారు. కరోనా నుంచి కోలుకున్న కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు…
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?