ప్రైవేట్ స్కూళ్ళకు వలసలు పెరిగాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా తల్లిదండ్రుల ఆదాయం తగ్గడంతో అప్పటివరకూ ప్రైవేట్ స్కూళ్ళలో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించిన వారు సర్కారీ బడుల బాట పట్టారు. చదువు ఎలా వున్నా ఫర్వాలేదు.. ఆర్థిక భారం మోయలేమంటూ వారంతా ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయించారు. అయితే పరిస్థితులు మారాయి. భుత్వ పాఠశాలల నుండి తిరిగి ప్రైవేట్ స్కూల్స్ కి విద్యార్థుల వలసలు పెరిగాయంటున్నారు అధికారులు.
కరోన కారణంగా లాక్ డౌన్, ఫీజులు కట్టలేక తమ పిల్లలను ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు తల్లి దండ్రులు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు నో అడ్మిషన్స్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీల రికమండేషన్లు కూడా తెచ్చుకుని తమ పిల్లల్ని చేర్పించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పుడు సాధారణ పరిస్థితి లు నెలకొనడం, ప్రభుత్వ స్కూల్స్ తెలుగు మీడియం కావడం తో పునరాలోచనలో పడ్డారు తల్లిదండ్రులు.
Also Read
దీనికితోడు ఆదాయం కోల్పోవడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ వైఖరి మార్చుకున్నాయి. స్కూల్ మారిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాత ఫీజులు కట్టకున్న ఫర్వాలేదు. ఇప్పటి నుండి ఫీజులు కడితే చాలని పేరెంట్స్ ను ఒప్పిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. దీంతో వలసలు పెరిగాయి. ప్రభుత్వ స్కూల్స్ నుండి తిరిగి ప్రైవేట్ కు పంపిస్తున్నారు తల్లిదండ్రులు.
మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ కి వలసలు మొదలయ్యాయని ఒప్పుకుంటున్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే వెళ్లిపోతున్నారని అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ప్రైవేట్ స్కూళ్ళ కంటే తమ దగ్గర నిపుణులైన ఉపాధ్యాయులు, సువిశాలమయిన ఆటస్థలాలు వున్నాయని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం గతంలోలాగే ప్రైవేట్ పాఠశాలలకు పంపడానికే మొగ్గుచూపుతున్నారు.
తాజావార్తలు
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!