ప్రైవేట్ స్కూళ్ళకు వలసలు పెరిగాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా తల్లిదండ్రుల ఆదాయం తగ్గడంతో అప్పటివరకూ ప్రైవేట్ స్కూళ్ళలో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించిన వారు సర్కారీ బడుల బాట పట్టారు. చదువు ఎలా వున్నా ఫర్వాలేదు.. ఆర్థిక భారం మోయలేమంటూ వారంతా ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయించారు. అయితే పరిస్థితులు మారాయి. భుత్వ పాఠశాలల నుండి తిరిగి ప్రైవేట్ స్కూల్స్ కి విద్యార్థుల వలసలు పెరిగాయంటున్నారు అధికారులు.
కరోన కారణంగా లాక్ డౌన్, ఫీజులు కట్టలేక తమ పిల్లలను ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు తల్లి దండ్రులు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు నో అడ్మిషన్స్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీల రికమండేషన్లు కూడా తెచ్చుకుని తమ పిల్లల్ని చేర్పించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పుడు సాధారణ పరిస్థితి లు నెలకొనడం, ప్రభుత్వ స్కూల్స్ తెలుగు మీడియం కావడం తో పునరాలోచనలో పడ్డారు తల్లిదండ్రులు.
Also Read
- UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
దీనికితోడు ఆదాయం కోల్పోవడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ వైఖరి మార్చుకున్నాయి. స్కూల్ మారిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాత ఫీజులు కట్టకున్న ఫర్వాలేదు. ఇప్పటి నుండి ఫీజులు కడితే చాలని పేరెంట్స్ ను ఒప్పిస్తున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. దీంతో వలసలు పెరిగాయి. ప్రభుత్వ స్కూల్స్ నుండి తిరిగి ప్రైవేట్ కు పంపిస్తున్నారు తల్లిదండ్రులు.
మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ కి వలసలు మొదలయ్యాయని ఒప్పుకుంటున్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే వెళ్లిపోతున్నారని అంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ప్రైవేట్ స్కూళ్ళ కంటే తమ దగ్గర నిపుణులైన ఉపాధ్యాయులు, సువిశాలమయిన ఆటస్థలాలు వున్నాయని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం గతంలోలాగే ప్రైవేట్ పాఠశాలలకు పంపడానికే మొగ్గుచూపుతున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!