విజయవాడ వరద ప్రాంతాల్లో శానిటేషన్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షించారు. చీపురు చేత పట్టి పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు నారాయణ. నిర్దేశించిన ప్రాంతాల్లో శానిటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసి యజమానులకు అప్పగించాలని ఆదేశించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వరద ప్రాంతాల్లో మొదటి రోజు ప్రజలను రక్షించేందుకు…
అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా గాలి వీస్తున్నా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో సైతం గట్టుపైనే గడిపారు మంత్రి రామానాయుడు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్కు వరద…
విజయవాడలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే బుడమేరు వరద ముంపుతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతుండటంతో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఇంకా జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, అంబాపురం, సింగ్ నగర్లో ఇంకా వరద నీరు నిలిచి ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ వరద బాతులకు సహాయ కార్యక్రమాల్లో ఇటువంటి ఆటంకాలు ఉండకూడదని, వారికి అవసరమైన…
ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు.. ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతోందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. సోలార్…
గత కొన్ని రోజుల నుంచి విస్తారంగా కురిసిన భారీ వర్షాలు క్రమంగా తగ్గు ముఖం పట్టడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురవడం వల్ల పెద్దగా నష్టాలేమీ సంభవించలేదు. అధికార యంత్రాంగం ఎప్పటి కప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే గత రెండు రోజుల నుంచి వర్షాలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. వాతావరణం పొడిగా మారి ఎండ పొరలు…
విజయవాడలో వరద బాధితుల కష్టాలు అన్నీఇన్ని కావు. చుట్టూ వరద నీరు ముంచేత్తిన అవసరాల కోసం చుక్క మంచినీరు దొరక్క అవస్థలు పడుతున్నారు. సితార ప్రాంతంలో ఒకే ఒక్క బావిలో మంచినీరు దొరకడంతో భావి వద్దకి బాధితులు క్యూ కడుతున్నారు. వరద నీటిలో కష్టాలు పడుతూ బిందెలు బకెట్లు టిన్నులతో నీళ్లను తోడుకుని వెళ్తున్నారు. బిందె నీటి కోసం దూర ప్రాంతాల నుంచి బాధితులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. విజయవాడ వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ఒక్కొక్కరికి కష్టాలు…
భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయక చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు గత రెండు రోజులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఆయన కాకుండా మంత్రులు సైతం అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఒక రూపాయి ఎక్కువైనా బాధితులకు ఆహారం మాత్రం కచ్చితంగా అందాలని…
నవారో సంచలనం.. యుఎస్ ఓపెన్లో కొకో గాఫ్ కథ ముగిసే! యుఎస్ ఓపెన్ 2024 నుంచి టాప్ సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. పురుషుల టైటిల్ ఫెవరెట్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరాజ్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్ కథ కూడా ముగిసింది. గాఫ్కు అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారో ప్రిక్వార్టర్స్లో షాకిచ్చింది. నాలుగో రౌండ్లో 6-3, 4-6, 6-3తో గాఫ్ను నవారో ఓడించింది. 60 అనవసర…
విజయవాడలోని సితార, రాజరాజేశ్వరి పేట, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ముంపు కొనసాగుతోంది. భారీ వర్షాలు వరదలకు పూర్తిగా ఇళ్లు మునగడం తో అపార్ట్మెంట్ల పైన, కొండలపైన తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు. వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఇళ్ల వద్దకు వచ్చి పరిస్థితి ఏరకంగా ఉందో చూసుకుంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లు ముంపు…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో విధ్వంసం కొనసాగుతోంది, రెండు రాష్ట్రాల్లో కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కురుస్తున్న వర్షం మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపింది, రైలు ట్రాక్లు, రోడ్లు , విస్తారమైన వ్యవసాయ భూములను వరదలు ముంచెత్తాయి, దీని ఫలితంగా రైళ్ల రద్దు , మళ్లింపు ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా రోజువారీ జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఏజెన్సీలు…