ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కాస్త ఆలస్యం కానుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 5 గంటలకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్లో అనంతపురం జిల్లాలోని నార్పల నుంచి పుట్టపర్తికి వెళ్లాల్సి ఉండగా.. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది.
టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శల దాడి చేశారు. చంద్రబాబు పురుషాధిక్య అభిప్రాయాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన వల్ల మహిళలకు ఏనాడూ మంచి జరగలేదని అన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను కొనసాగిస్తోంది. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఆదివారం అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డి అరెస్ట్పై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసిందని.. సిల్లీ విషయాలను సీరియస్గా తీసుకుంటోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్రెడ్డి నివాసానికి వెళ్లారు.
Cinema to the people: ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్టు మనకు ఇంతకుముందే తెలుసు. గతంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలుచేశారు. ఇప్పుడు అలాంటి విధానమే సినిమాల విషయంలో అందుబాటులోకి రాబోతోంది.
ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ విధానాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరో విధానాన్ని ఆవిష్కరించనుంది. ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
చుక్కల భూములకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి కాకాణ గోవర్ధన్ రెడ్డి అన్నారు. జీవో విడుదల చేయడంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.