Kakani Govardhan Reddy: చుక్కల భూములపై సీఎం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: చుక్కల భూములకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి కాకాణ గోవర్ధన్ రెడ్డి అన్నారు. జీవో విడుదల చేయడంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని.. వీఆర్వో నుంచి ఫైల్ రావాలంటే ఆరు నెలలు పట్టేదని ఆయన విమర్శించారు. చాలా భూములకు సంబంధించి పరిష్కారం లభించలేదన్నారు. రైతుల సమస్యలు చూసి జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. చాలా చోట్ల రైతులు భూములను సాగు చేసుకుంటున్నారని.. వీరికి పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అభ్యంతరాలు లేని భూములను రెగ్యులర్ చేయమని చెప్పారన్నారు.
చంద్రబాబు హయాంలో వీటిని నిషేధిత జాబితాలో పెట్టారన్న ఆయన.. రైతుల కష్టాలు చూసి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయంతో నెల్లూరు జిల్లాలోనే 40 వేల ఎకరాల మేర రైతులకు ప్రయోజనం కలగనుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే జిల్లాలో పర్యటించి రైతులకు పత్రాలు అందిస్తారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
Read Also: Ambati Rambabu: నా ప్రాణం ఉన్నంతవరకు సత్తెనపల్లిలోనే ఉంటా..
చుక్కల భూములు అంటే..
1924 -1946 మధ్య కాలంలో లోనో రెవిన్యూ వాళ్ల ఒక సర్వే చేశారట. ఆసర్వే జరుపుతున్నపుడు కొన్ని చోట్ల భూముల యజమాని అందుబాటులో లేడని యజమాని కాలమ్ నింపకుండా చుక్కలు పెట్టారు. ఇలాంటి చుక్కలు పెట్టిన భూములే చుక్కల భూములు. రెవిన్యూ వాళ్ల వాడుకలో ఇవి ’డాటెడ్ ల్యాండ్స్’. భూములు లేని రైతులు, పేదలకు ఈ భూములు కేటాయించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?