టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మబోరన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్. బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన రైతు సంఘీభావ యాత్ర లో పాల్గొన్నారు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్. అర్హతే ప్రామాణికంగా అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రాష్ట్రాభివృద్ధి, ప్రజల అవసరాల కోసం అప్పు చేసే అధికారం ప్రభుత్వానికి…
దేశంలో అప్పుల్లో ఉన్న రాష్ట్రాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఆయా రాష్ట్రాల అప్పుల వివరాలను ప్రకటించింది. దేశంలో అప్పుల భారం ఎక్కువగా ఉన్న టాప్ టెన్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిర్దారించిన రుణ, ఆర్థిక లోటు పరిమితులను ఆంధ్రప్రదేశ్ దాటేసిందని ఆర్బీఐ వివరించింది. బడ్జెటేతర రుణాల కోసం దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత అధికంగా జీఎస్డీపీలో…
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు. మాజీ మంత్రి పేర్ని నాని బీజేపీపై చేసిన విమర్శలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైరయ్యారు. మాది పువ్వు పార్టీనా.? అడ్డంగా బలిశారంటూ మా నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బలిసిన మాటలు. మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ. డబ్బా ఫ్యాన్ తమ నెత్తి మీద ఎప్పుడు…
రాజమండ్రిలో జరిగిన గోదావరి గర్జన సభలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఢిల్లీ నుంచి చాలా అబద్ధాలను పోగేసుకుని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై జేపీ నడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక్క మాటైనా చెప్పారా అని నాని ప్రశ్నించారు. పోలవరం పెండింగ్ బిల్లులు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. ఈడీ, ఐటీ దాడులతో…
రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోందని మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జగన్ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారు.కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం కొలేటరల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.సీఎం జగనుది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారు. రాష్ట్రం 7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుంది.సీఎం జగన్ దుర్వినియోగం చేసిన రుణాలను ఎవరు తిరిగి చెల్లిస్తారన్నదే ఇపుడు ప్రశ్న?కార్పొరేషన్లు గానీ,…
అప్పులు అందులోని తప్పులపై వైసీపీ.. టీడీపీ మధ్య ఫైట్ జరుగుతోంది. పీఏసీ ఛైర్మన్ ఆరోపణల తర్వాత ఈ రగడ పీక్కు వెళ్లింది. ఇంతలో బీజేపీ ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా లేక.. రెస్క్యూకి వచ్చారా అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకీ ఆ కమలనాథుడి లేఖ ఆంతర్యం ఏంటి? గవర్నర్కు బీజేపీ ఎంపీ జీవీఎల్ రాసిన లేఖపై చర్చ! ఏపీ ఆర్థిక వ్యవహారాలపై గవర్నర్ను కలిసి PAC ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేసిన…